స్ట్రెచర్‌పై పడుకుని ఎన్నికల ప్రచారం

By ramya NFirst Published Apr 8, 2019, 10:06 AM IST
Highlights

ఆరోగ్యం బాలేదు.. కనీసం నడిచే పరిస్థితి కూడా లేదు. పైగా ఎండలు మండిపోతున్నాయి. కానీ.. ఎన్నికల ప్రచారం కూడా చేయాల్సిన పరిస్థితి. అందుకే ఓ అభ్యర్థి ఏకంగా స్ట్రెచర్‌పై పడుకుని మరీ ఎన్నికల ప్రచారం నిర్వహించారు.

ఆరోగ్యం బాలేదు.. కనీసం నడిచే పరిస్థితి కూడా లేదు. పైగా ఎండలు మండిపోతున్నాయి. కానీ.. ఎన్నికల ప్రచారం కూడా చేయాల్సిన పరిస్థితి. అందుకే ఓ అభ్యర్థి ఏకంగా స్ట్రెచర్‌పై పడుకుని మరీ ఎన్నికల ప్రచారం నిర్వహించారు. ఈ సంఘటన కర్నూలు జిల్లా మంత్రాలయంలో చోటుచేసుకుంది.

మంత్రాలయం నియోజకవర్గంలో టీడీపీ అభ్యర్థిగా ప్యాలకుర్తి తిక్కారెడ్డి బరిలో ఉన్నారు. మొదట్లో సైకిల్‌ యాత్ర, ర్యాలీలు, సభల పేరుతో కొన్ని గ్రామాలు చుట్టేశారు. ఇలా మంత్రాలయం మండలం ఖగ్గల్లు గ్రామంలో ప్రచారానికి వెళ్లారు. 

అక్కడ వైసీపీ నాయకులు ఏకపక్షంగా అడ్డుకునే యత్నంలో ఘర్షణ జరిగింది. అంగరక్షకులు గాల్లోకి కాల్పులు జరిపిన ఘటనలో తిక్కారెడ్డి కాలికి బుల్లెట్‌ గాయమై కుప్పకూలారు. చికిత్స చేయించుకొని ప్రత్యేక అంబులెన్స్‌లో స్ట్రెచర్‌పై వచ్చి నామినేషన్‌ సమర్పించారు. 

 ఇప్పుడు కూడా స్ట్రెచర్ పైనే ఎన్నికల ప్రచారం చేస్తున్నారు. ఆయన భార్య ఆయనకు తోడుగా నిలిచారు. భర్తకు ఓట్లు వేసి గెలిపించాలని ఓటర్లను ఆమె అభ్యర్థించారు. 

click me!