వైఎస్ జగన్ సీఎం కాలేడు, మళ్లీ జైలుకే

Published : Mar 03, 2019, 07:10 AM IST
వైఎస్ జగన్ సీఎం కాలేడు, మళ్లీ జైలుకే

సారాంశం

వైఎస్ జగన్ ఢిల్లీ పర్యటనలో కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు రాహుల్ గాంధీని కలిశారంటూ చెప్పుకొచ్చారు. జగన్ ఓడిపోతారన్న భయంతో రాహుల్ ను కలిశారంటూ ధ్వజమెత్తారు. రాష్ట్రంలో కాంగ్రెస్‌, వైసీపీ, టీడీపీ కలిసిపోయాయని ఆరోపించారు.   

ఢిల్లీ: వైసీపీ అధినేత, ఏపీ ప్రతిపక్ష నేత వైఎస్ జగన్మోహన్ రెడ్డిపై ప్రజాశాంతి పార్టీ అధ్యక్షుడు కేఏ పాల్ సంచలన వ్యాఖ్యలు చేశారు. వైఎస్ జగన్ సీఎం కాలేరంటూ చెప్పుకొచ్చారు. ఢిల్లీలో మీడియాతో మాట్లాడిన ఆయన వైఎస్ జగన్ పై కీలక వ్యాఖ్యలు చేశారు. 

వైఎస్ జగన్ ఢిల్లీ పర్యటనలో కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు రాహుల్ గాంధీని కలిశారంటూ చెప్పుకొచ్చారు. జగన్ ఓడిపోతారన్న భయంతో రాహుల్ ను కలిశారంటూ ధ్వజమెత్తారు. రాష్ట్రంలో కాంగ్రెస్‌, వైసీపీ, టీడీపీ కలిసిపోయాయని ఆరోపించారు. 

జగన్‌ ఒక మాయ అంటూ వ్యాఖ్యానించారు. జగన్‌ ఎన్నటికీ సీఎం కాలేరని చెప్పుకొచ్చారు. జగన్ మళ్లీ జైలుకు వెళ్ళడం ఖాయమన్నారు. జగన్ అనుకున్నట్లు మోదీ మళ్లీ అధికారంలోకి రారని కేఏ పాల్ స్పష్టం చేశారు. 

PREV
click me!

Recommended Stories

Rain Alert: భారీ వర్షాలు.. రెండో ప్రమాద హెచ్చరిక ప్ర‌క‌టించే అవ‌కాశం, ప్రజలకు కీలక సూచన
భోగాపురం వేదికగా గిన్నిస్ రికార్డ్ | Dhimsa Dance at Bhogapuram Airport | Asianet News Telugu