పట్టిసీమ శివరాత్రి ఉత్సవాల్లో తొక్కిసలాట .. ఒకరు మృతి

Published : Mar 04, 2019, 04:31 PM IST
పట్టిసీమ శివరాత్రి ఉత్సవాల్లో తొక్కిసలాట .. ఒకరు మృతి

సారాంశం

పట్టిసీమ శివరాత్రి ఉత్సవాల్లో విషాదం చోటుచేసుకుంది. భక్తులు అధిక సంఖ్యలో తరలిరావడంతో.. తొక్కిసలాట జరిగింది. 

పట్టిసీమ శివరాత్రి ఉత్సవాల్లో విషాదం చోటుచేసుకుంది. భక్తులు అధిక సంఖ్యలో తరలిరావడంతో.. తొక్కిసలాట జరిగింది. ఈ క్రమంలో ఓ వృద్ధురాలు కన్నుమూసింది. పలువురికి గాయాలు కూడా అయినట్లు సమాచారం.

శివరాత్రిని పురస్కరించుకొని భక్తులు అధిక సంఖ్యలో వచ్చినట్లు అధికారులు తెలిపారు. కాగా.. భక్తులకు తగ్గట్టుగా ఏర్పాట్లు చేయకపోవడంతో ఈ ఘటన చోటుచేసుకుంది. స్వామి వారిని దర్శించుకునేందుకు భక్తులు ఎండలో క్యూలో నిలబడాల్సిన పరిస్థితి ఏర్పడింది. దీంతో అధికారుల తీరుపై భక్తులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. కాగా ఈ ఘటనకు సంబంధించి పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.

PREV
click me!

Recommended Stories

Weather Update: బంగాళాఖాతంలో ముంచుకొస్తున్న అల్పపీడనం.. ఆ జిల్లాల్లో వానలే వానలు !
IMD Rain Alert : బంగాళాఖాతంలో అల్పపీడనం, అరేబియాలో ద్రోణి.. ఈ ప్రాంతాల్లో భారీ వర్షాలతో అల్లకల్లోలమే