ఎమ్మెల్యే కోటా ఎమ్మెల్సీ ఎన్నికలపై వైసీపీ కసరత్తు.. మంత్రులకు ఎమ్మెల్యేల బాధ్యత.. ఈరోజు మాక్ పోలింగ్..!!

Published : Mar 18, 2023, 01:00 PM IST
ఎమ్మెల్యే కోటా ఎమ్మెల్సీ ఎన్నికలపై వైసీపీ కసరత్తు.. మంత్రులకు ఎమ్మెల్యేల బాధ్యత.. ఈరోజు మాక్ పోలింగ్..!!

సారాంశం

ఆంధ్రప్రదేశ్‌లో ఎమ్మెల్యే కోటా ఎమ్మెల్సీ ఎన్నికలకు సంబంధించి వైసీపీ కసరత్తును ముమ్మరం చేసింది. 

ఆంధ్రప్రదేశ్‌లో ఎమ్మెల్యే కోటా ఎమ్మెల్సీ ఎన్నికలకు సంబంధించి వైసీపీ కసరత్తును ముమ్మరం చేసింది. ఏపీలో ఎమ్మెల్యే కోటాలో 7 ఎమ్మెల్సీ స్థానాలకు ఎన్నిక జరగనున్న సంగతి  తెలిసిందే. ఇందుకు సంబంధించి వైసీపీ అభ్యర్థుల ఎన్నిక  ఏకగ్రీవమే అని భావించినప్పటికీ.. టీడీపీ కూడా అభ్యర్థిని బరిలో నిలుపడంతో ఎన్నిక అనివార్యమైంది. ఈ క్రమంలోనే వైసీపీ అధిష్టానం అప్రమత్తమైంది. ముందు జాగ్రత్త  చర్యల్లో భాగంగా.. ఎన్నికల్లో తమ పార్టీ ఎమ్మెల్యేల ఓట్లు  వృథా కాకుండా కసరత్తు చేపట్టింది.

పలువురు మంత్రులకు 20 మంది ఎమ్మెల్యేల చొప్పున బాధ్యతను అప్పగించింది. ఎన్నికల కసరత్తులో భాగంగా.. ఈ  రోజు మధ్యాహ్నం 3 గంటలకు తమ సభ్యులతో మాక్ పోలింగ్ నిర్వహించేందుకు రెడీ అయింది. అసెంబ్లీ ప్రాంగణంలోని మీటింగ్‌ హాల్‌లో మాక్ పోలింగ్ నిర్వహించనున్నారు. 

ఇదిలా ఉంటే.. ఎమ్మెల్యే కోటా ఎమ్మెల్సీ  ఎన్నికలకు మార్చి 23న పోలింగ్ జరగనుంది. ఈ ఎన్నికల్లో వైసీపీ నుంచి పెనుమత్స సూర్యనారాయణ రాజు, కోలా గురువులు, ఇజ్రాయిల్, మ‌ర్రి రాజశేఖర్, జయమంగళం వెంకట రమణ, పోతుల సునీత, చంద్రగిరి యేసురత్నంలు బరిలో నిలిచారు. టీడీపీ నుంచి పంచుమర్తి అనురాధ బరిలో ఉన్నారు. 

PREV
click me!

Recommended Stories

Nimmala Rama Naidu Pressmeet: ఉగ్రవాదులకంటే ఉన్మాదం జగన్ పై రెచ్చిపోయిన నిమ్మల | Asianet News Telugu
Thalassemia Run 2026: ఆ రోజు ఆ తల్లి, బిడ్డని చూసి..నారా భువనేశ్వరి ఎమోషనల్ | Asianet News Telugu