ఏపీ సీఎం చంద్రబాబుపై వైసీపీ ఎంపీ విజయసాయిరెడ్డి మరోసారి విరుచుకుపడ్డారు. ప్రధాన మంత్రి పదవి దక్కుతోందో లేదా తెలియదు కానీ... జైలుకు వెళ్లడం ఖాయమని ఆయన వ్యాఖ్యానించారు.
అమరావతి: ఏపీ సీఎం చంద్రబాబుపై వైసీపీ ఎంపీ విజయసాయిరెడ్డి మరోసారి విరుచుకుపడ్డారు. ప్రధాన మంత్రి పదవి దక్కుతోందో లేదా తెలియదు కానీ... జైలుకు వెళ్లడం ఖాయమని ఆయన వ్యాఖ్యానించారు.
చంద్రబాబు సమీక్షలకు వెళ్లాలంటే పార్టీ నాయకులు భయపడుతున్నారట. తన కుల(తొలి) వెలుగు కేసుల్లో ఇరుక్కుంటే కనీసం మాట సాయం చేయలేని పరిస్థితి. ఆ కోపమంతా తమపై ప్రదర్శిస్తున్నాడని తమ్ముళ్లు వాపోతున్నారట. మామూలుగా నైతే మీడియాపై దాడి అని రెచ్చిపోయేవాడు.
— Vijayasai Reddy V (@VSReddy_MP)ఊహకందని కోతలతో గ్రామాల్లో ఆహ్లాదాన్ని పంచే పిట్టల దొరలు, తుపాకి రాముళ్లను మించి పోయాడు చంద్రబాబు. రాష్ట్రంలో కనీసం 30 అసెంబ్లీ స్థానాల్లో గెలిచే సీన్ లేదు. అనుకూల మీడియాతో ప్రధాని రేసులో ఉన్నాడని ‘కలల’ కథనాలు రాయించుకుంటున్నాడు. ప్రధాని పదవేమో కానీ జైలుకు వెళ్లడం మాత్రం ఖాయం.
— Vijayasai Reddy V (@VSReddy_MP)
సోమవారం నాడు ట్విట్టర్ వేదికగా ఏపీ సీఎం చంద్రబాబుపై వైసీపీ ఎంపీ విజయసాయి రెడ్డి ఈ వ్యాఖ్యలు చేశారు. చంద్రబాబునాయుడు పిట్టల దొరలు, తుపాకి రాముళ్లను మించిపోయాడని ఆయన ఎద్దేవా చేశారు.
తనకు అనుకూలమైన మీడియాతో చంద్రబాబునాయుడు ప్రధాన మంత్రి పదవి రేసులో ఉన్నాడని కథనాలు రాయించుకొంటున్నాడని ఆయన విమర్శించారు. ఏపీ రాష్ట్రంలో టీడీపీకి కనీసం 30 అసెంబ్లీ స్థానాలు కూడ దక్కవన్నారు.
చంద్రబాబుకు ప్రధానమంత్రి పదవి దక్కుతోందో లేదో తెలియదు కానీ.... జైలుకు మాత్రం వెళ్తారని ఆయనతీవ్ర వ్యాఖ్యలే చేశారు. మరో వైపు బాబు నిర్వహించే సమీక్ష సమావేశాలకు ఆ పార్టీ నేతలు హాజరుకాకపోవడంపై కూడ ఆయన సెటైర్లు వేశారు.