విదేశాలకు పారిపోతోంది ఎవరు: విజయసాయిరెడ్డిపై రఘురామ వ్యాఖ్యలు

By Siva KodatiFirst Published Aug 27, 2021, 2:58 PM IST
Highlights

వైసీపీ ఎంపీ విజయసాయిరెడ్డిపై విరుచుకుపడ్డారు ఆ పార్టీ రెబల్ రఘురామకృష్ణంరాజు. తీరప్రాంతాల్లో అధ్యయనానికి వెళ్తున్నానని విజయసాయి చెప్పారని.. విశాఖ తీర ప్రాంతం ఎంతవరకు బాగుపడుతుందో చూద్దామంటూ వ్యాఖ్యానించారు.

వైసీపీ ఎంపీ విజయసాయిరెడ్డి విదేశీ పర్యటనకు అనుమతివ్వడంపై అభ్యంతరం వ్యక్తం చేశారు ఆ పార్టీ రెబల్ నేత, నర్సాపురం ఎంపీ రఘురామకృష్ణరాజు . తీరప్రాంతాల్లో అధ్యయనానికి వెళ్తున్నానని విజయసాయి చెప్పారని.. విశాఖ తీర ప్రాంతం ఎంతవరకు బాగుపడుతుందో చూద్దామంటూ వ్యాఖ్యానించారు. ఢిల్లీలో శుక్రవారం నిర్వహించిన మీడియా సమావేశంలో రఘురామ మాట్లాడారు. ఈ సందర్భంగా వైసీపీ నేతలను ఉద్దేశించి విమర్శలు చేశారు. 

తానేదో విదేశాలకు పారిపోతానని ప్రచారం చేశారని... ఇప్పుడెవరు వెళ్తున్నారు? వారి మనసులో ఉన్న విషయాలను అందరిపై ఆపాదిస్తున్నారంటూ మండిపడ్డారు. కోర్టు తీర్పు రాకముందే కొన్ని విషయాలు ఎలా చెప్పగలుగుతున్నారని రఘురామ ప్రశ్నించారు. ఈ అంశంపై విచారణ చేపట్టాల్సిందిగా కోర్టులో పిటిషన్‌ దాఖలు చేస్తా అని ఆయన చెప్పారు. 

click me!