ఉపరాష్ట్రపతి ఎన్నిక‌లో వైసీపీ మ‌ద్ధ‌తు ఎవ‌రికంటే.. క్లారిటీ వ‌చ్చేసింది.

Published : Aug 21, 2025, 04:15 PM IST
YSRCP

సారాంశం

ఉప‌రాష్ట్ర‌ప‌తి ఎన్నిక‌పై అంద‌రి దృష్టి ప‌డిన విష‌యం తెలిసిందే. అటు ఎన్టీఏ ఇటు యూపీఏలు పోటాపోటీగా అభ్య‌ర్థుల‌ను ప్ర‌క‌టించాయి. ఈ నేప‌థ్యంలోనే తాజాగా వైసీపీ త‌మ మ‌ద్ధ‌తును ప్ర‌క‌టించింది. వివ‌రాల్లోకి వెళితే.. 

వైసీపీ స్టాండ్‌పై బొత్స క్లారిటీ

 

ఉపరాష్ట్రపతి ఎన్నికలపై దేశవ్యాప్తంగా చర్చ జరుగుతున్న వేళ, వైసీపీ తమ వైఖరిని స్పష్టంగా ప్రకటించింది. శాసనసభ్య మండలి సభ్యుడు, మాజీ మంత్రి బొత్స సత్యనారాయణ గురువారం రాజమండ్రిలో మీడియాతో మాట్లాడారు. రాజ్యాంగ బద్ధమైన పదవుల విషయంలో సంఖ్యా సమీకరణలు ప్రాధాన్యం ఇవ్వకూడదన్నదే వైసీపీ విధానం అని ఆయన చెప్పారు. పార్టీ ప్రారంభం నుంచి ఇదే ధోరణి అవ‌లంభిస్తోంద‌ని చెప్పుకొచ్చారు.

ఈ విష‌య‌మై బొత్స మాట్లాడుతూ, కాంగ్రెస్‌ ప్రభుత్వ కాలంలో రాష్ట్రపతిగా పోటీ చేసిన ప్రణబ్ ముఖర్జీకి వైఎస్‌ జగన్‌ మద్దతు ఇచ్చిన విషయాన్ని గుర్తు చేశారు. అప్పట్లోనూ ఇదే విధానం పాటించామని, ఇప్పుడు కూడా అదే మార్గంలో ముందుకు వెళ్తున్నామని అన్నారు. రాజ్యాంగ పదవులు పార్టీ రాజకీయాలకు అతీతం కావాలని ఆయన వ్యాఖ్యానించారు.

ఎన్డీఏ అభ్యర్థికి వైసీపీ మద్దతు

ఇక ఈసారి ఉపరాష్ట్రపతి ఎన్నికల్లో ఎన్డీఏ అభ్యర్థికి మద్దతు ఇవ్వాలని వైసీపీ నిర్ణయించింది. ఇప్పటికే పార్టీ అధ్యక్షుడు వైఎస్‌ జగన్మోహన్‌రెడ్డి తన వైఖరిని ప్రకటించారు. రక్షణ మంత్రి రాజ్‌నాథ్‌సింగ్‌ జగన్‌తో ఫోన్‌లో మాట్లాడి, ఎన్నికను ఏకగ్రీవంగా చేయాలనుకున్నామని తెలిపారు. అయితే ఇండియా కూటమి అభ్యర్థిని బరిలోకి దింపడం వల్ల పోటీ తప్పనిసరైందని ఆయన చెప్పారు.

తెలుగు అభ్యర్థి అంశంపై స్పందన

తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి చేసిన “తెలుగు అభ్యర్థికి మద్దతు ఇవ్వాలి” అన్న సూచనపై బొత్స సత్యనారాయణ స్పష్టమైన సమాధానం ఇచ్చారు. “ఎన్డీఏ అభ్యర్థి దక్షిణాది వాడే కదా?” అని ఆయన ప్రశ్నించారు. ప్రాంతీయత కంటే రాజ్యాంగ బద్ధమైన పదవుల ప్రాముఖ్యత ఎక్కువని ఆయన స్పష్టం చేశారు.

సీపీ రాధాకృష్ణన్‌కు మద్దతు

ఎన్డీఏ తరఫున ఉపరాష్ట్రపతి అభ్యర్థిగా మహారాష్ట్ర గవర్నర్‌, తమిళనాడుకు చెందిన సీపీ రాధాకృష్ణన్ బరిలోకి దిగుతున్నారు. ఆయనకు మద్దతు ఇవ్వాలని రాజ్‌నాథ్ సింగ్ వైఎస్‌ జగన్‌ను కోరగా, జగన్ సానుకూలంగా స్పందించి పార్టీతో చర్చించి నిర్ణయం తీసుకుంటామని చెప్పారు. ఆ తర్వాత వైసీపీ అధికారికంగా మద్దతు ప్రకటించింది.

వైసీపీ బలం

ప్రస్తుతం వైసీపీకి లోక్‌సభలో నలుగురు, రాజ్యసభలో ఏడుగురు – మొత్తం 11 మంది ఎంపీలు ఉన్నారు. ఉపరాష్ట్రపతి ఎన్నికల్లో ఎన్డీఏ అభ్యర్థి విజయం ఖాయమే అయినా, వైసీపీ మద్దతు కీలకమని విశ్లేషకులు భావిస్తున్నారు.

PREV
Read more Articles on
click me!

Recommended Stories

Chandrababu NaiduL: క్వాంటం టెక్నాలజీపై చంద్రబాబు అదిరిపోయే స్పీచ్ | Asianet News Telugu
CM Chandrababu Naidu: టెక్ విద్యార్థులతో చంద్రబాబు ‘క్వాంటమ్ టాక్’ | Asianet News Telugu