మోటారు బైక్ ఎక్కిన జగన్

First Published Feb 5, 2018, 5:02 PM IST
Highlights
  • వైసిపి అధ్యక్షుడు వైఎస్ జగన్మోహన్ రెడ్డి మోటారు బైక్ ఎక్కారు.

వైసిపి అధ్యక్షుడు వైఎస్ జగన్మోహన్ రెడ్డి మోటారు బైక్ ఎక్కారు. ప్రజా సంకల్పయాత్రలో భాగంగా జగన్ సోమవారం నెల్లూరు జిల్లాలో 80వ రోజు కొవ్వూరులో పాదయాత్ర చేస్తున్నారు. ఆ సందర్భంగా కొందరు అభిమానులు జగన్ వద్దకు ఓ మోటారు బైకును తీసుకొచ్చారు.

జగన్ ముందు బైక్ ను నిలిపి దానిపై కూర్చోమని అడిగారు. దాంతో జగన్ కాదనలేక మోటారుబైక్ పై కూర్చున్నారు. ఇంకేముంది అభిమానులకు పండగే పండగ. వెంటనే మోటారుబైక్ పై ఉన్న జగన్ తో అభిమానులు సెల్ఫీలు కూడా దిగారు. ఆ ఫోటోలే ఇపుడు మీరు చూస్తున్నవి.

click me!