జనవరి 1 నుంచి ఇంటింటికి రేషన్: పక్కా ఏర్పాట్లు

Siva Kodati |  
Published : Dec 20, 2020, 05:14 PM IST
జనవరి 1 నుంచి ఇంటింటికి రేషన్: పక్కా ఏర్పాట్లు

సారాంశం

జనవరి 1 నుంచి ఇంటింటికీ రేషన్ ఇచ్చేందుకు కసరత్తు చేస్తోంది ఏపీ ప్రభుత్వం. నాణ్యమైన బియ్యం సహా నిత్యావసరాలను ఇంటి వద్దే ఇవ్వబోతోంది. ఇందుకోసం 9 వేల వాహనాలను సిద్ధం చేసింది సర్కార్

జనవరి 1 నుంచి ఇంటింటికీ రేషన్ ఇచ్చేందుకు కసరత్తు చేస్తోంది ఏపీ ప్రభుత్వం. నాణ్యమైన బియ్యం సహా నిత్యావసరాలను ఇంటి వద్దే ఇవ్వబోతోంది. ఇందుకోసం 9 వేల వాహనాలను సిద్ధం చేసింది సర్కార్.

టాటా, సుజుకీ సంస్థల ద్వారా డోర్ డెలీవరి ట్రక్కులను కొనుగోలు చేసింది. డెలీవరి ట్రక్కులోనే కాటా పెట్టి ఇళ్ల వద్దే రేషన్ పంపిణీ చేస్తారు. ట్రక్కులో ఒక ఫ్యాన్, ఫైర్ ఎక్సటింగ్విషర్, ఫస్ట్ ఎయిడ్ బాక్స్ అందుబాటులో  ఉంచనున్నారు.

ఎనౌన్సమెంట్ కోసం మైక్ సిస్టం కూడా ఏర్పాటు చేసినట్టు సమాచారం.  సబ్సిడీ ద్వారా డోర్ డెలివరీ వాహానాలను ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ వర్గాలకు కేటాయించినట్టు చెబుతున్నారు. ఇక కొన్ని చోట్ల అద్దె ప్రాతిపదికన కూడా వీటిని తీసుకోనున్నట్టు తెలుస్తోంది. 

PREV
click me!

Recommended Stories

Deputy CM Pawan Kalyan: కలెక్టర్ల కాన్ఫరెన్స్‌ సమావేశంలో పవన్ కీలక ప్రసంగం | Asianet News Telugu
CM Chandrababu: జిల్లా కలెక్టర్లే ప్రభుత్వానికిబ్రాండ్ అంబాసిడర్లు: బాబు | Asianet News Telugu