వైసీపీ పాలనకు మూడేళ్లు... జగన్ స్పెషల్ ట్వీట్...!

Published : May 30, 2022, 11:44 AM IST
వైసీపీ పాలనకు మూడేళ్లు... జగన్ స్పెషల్ ట్వీట్...!

సారాంశం

రాష్ట్ర ప్రజలు తనపై పెట్టుకున్న న‌మ్మకాన్ని నిల‌బెట్టుకుంటూ గ‌డిచిన మూడేళ్లలో 95 శాతానికి పైగా హామీల‌ను అమ‌లు చేసినట్లు తెలిపారు. 

ఆంధ్రప్రదేశ్ లో వైసీపీ పాలనకు మూడేళ్లు పూర్తయ్యాయి. మూడేళ్ల క్రితం 151 సీట్ల తో వైసీపీ అఖండ విజయం సాధించి... జగన్మోహన్ రెడ్డి.. ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టారు. కాగా... నేటితో జగన్మోహన్ రెడ్డి సీఎంగా బాధ్యతలు చేపట్టి.. మూడేళ్లు పూర్తి చేసుకున్నారు. ఈ నేపథ్యంలో...  సీఎం జగన్.. ఎమోషనల్ ట్వీట్ చేశారు.

రాష్ట్ర ప్రజలు తనపై పెట్టుకున్న న‌మ్మకాన్ని నిల‌బెట్టుకుంటూ గ‌డిచిన మూడేళ్లలో 95 శాతానికి పైగా హామీల‌ను అమ‌లు చేసినట్లు తెలిపారు. రాబోయే రోజుల్లో మరింతగా సేవ చేస్తానని హామీ ఇచ్చారు. ప్రజల ప్రేమాభిమానాలు నాపై ఎప్పటికీ ఇలాగే ఉండాలని మ‌న‌స్ఫూర్తిగా కోరుకుంటున్నట్లు తెలిపారు.

 

‘‘మీరు చూపిన ప్రేమ‌, మీరు అందించిన ఆశీస్సుల‌తో ముఖ్యమంత్రిగా బాధ్యత‌లు చేప‌ట్టి మూడేళ్లు అవుతోంది. మీరు నాపై పెట్టుకున్న న‌మ్మకాన్ని నిల‌బెట్టుకుంటూ గ‌డిచిన మూడేళ్లలో 95 శాతానికి పైగా హామీల‌ను అమ‌లు చేశాం. ఎన్నో మంచి ప‌నుల‌కు శ్రీ‌కారం చుట్టాం. రాబోయే రోజుల్లో మీకు మరింతగా సేవ చేస్తానని, మీ ప్రేమాభిమానాలు నాపై ఎప్పటికీ ఇలాగే ఉండాలని మ‌న‌స్ఫూర్తిగా కోరుకుంటున్నా. మీకు సేవ చేసే భాగ్యాన్ని నాకు కల్పించినందుకు మ‌రొక్క‌సారి అందరికీ కృత‌జ్ఞ‌త‌లు తెలియ‌జేసుకుంటున్నా.’’ అని సీఎం జగన్ పేర్కొన్నారు.
 

PREV
click me!

Recommended Stories

ఆంధ్ర‌ప్ర‌దేశ్ భ‌విష్య‌త్తును మార్చే ప్రాజెక్ట్‌.. దేశంలోనే అతిపెద్ద ప్రైవేట్ బంగారం మైనింగ్
Pemmasani Speech: రజతోత్సవ కార్యక్రమంలోపెమ్మసాని అదిరిపోయే స్పీచ్ | Cancer Hospital Silver Jubilee