కర్నూలు జిల్లాలో టెన్త్ విద్యార్థినితో యువకుల అసభ్య ప్రవర్తన..

Published : Aug 13, 2022, 12:17 PM ISTUpdated : Aug 13, 2022, 01:33 PM IST
కర్నూలు జిల్లాలో టెన్త్ విద్యార్థినితో యువకుల అసభ్య ప్రవర్తన..

సారాంశం

కర్నూలు జిల్లాలో అల్లరి మూక రెచ్చిపోయింది. కొందరు యువకులు పదో తరగతి విద్యార్థినితో అసభ్యంగా ప్రవర్తించారు. ఈ ఘటనపై విద్యార్థిని పోలీసులకు ఫిర్యాదు చేసింది.

కర్నూలు జిల్లాలో అల్లరి మూక రెచ్చిపోయింది. కొందరు యువకులు పదో తరగతి విద్యార్థినితో అసభ్యంగా ప్రవర్తించారు. వివరాలు.. జిల్లాలోని ఎమ్మిగనూరు మండలం పార్లపల్లిలో పదో తరగతి విద్యార్థిని పట్ల కొందరు విద్యార్థులు అసభ్యంగా ప్రవర్తించారు. ఓ యువకుడు బలవంతంగా విద్యార్థిని ముద్దు పెట్టాడు. అయితే అక్కడే ఉన్న తోటి విద్యార్థులు తిరగబడటంతో అల్లరి చేస్తున్న యువకులు అక్కడి నుంచి పరారయ్యారు. అనంతరం బాధిత విద్యార్థిని.. ఈ ఘటనకు సంబంధించి పోలీసు స్టేషన్‌కు వెళ్లి ఫిర్యాదు చేసింది.

అయితే రెండు రోజులు గడిచిన పోలీసులు ఎలాంటి చర్యలు తీసుకోలేదనే ఆరోపణలు వినిపిస్తున్నాయి. పోకిరీలు బడా బాబుల పిల్లలు కావడంతోనే పోలీసులు కేసు నమోదు చేయాలనే స్థానికులు ఆరోపిస్తున్నారు. కాగా, ఈ ఘటనకు సంబంధించి పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.  

PREV
click me!

Recommended Stories

పవన్‌ కళ్యాణ్‌.. 30వేల మంది మహిళలు ఏమయ్యారు? Vidadala Rajini Comments| Asianet News Telugu
300 ఎక‌రాల్లో, రూ. 8,175 కోట్ల పెట్టుబ‌డి.. ఆంధ్ర‌ప్ర‌దేశ్‌లోని ఈ గ్రామం రూపు రేఖ‌లు మార‌డం ఖాయం