నర్సీపట్నంలో అమానుషం... ఆరేళ్ల చిన్నారిపై పక్కింటి 3‌0ఏళ్ల యువకుడు అత్యాచారం

Arun Kumar P   | Asianet News
Published : May 06, 2022, 10:10 AM ISTUpdated : May 06, 2022, 10:30 AM IST
నర్సీపట్నంలో అమానుషం... ఆరేళ్ల చిన్నారిపై పక్కింటి 3‌0ఏళ్ల యువకుడు అత్యాచారం

సారాంశం

అభం శుభం తెలియని ఆరేళ్ళ చిన్నారిని పక్కింట్లో వుండే 30ఏళ్ల యువకుడు అర్థరాత్రి ఎత్తుకెళ్లి అతి దారుణంగా అత్యాచారానికి పాల్పడిన అమానుషం అనకాపల్లి జిల్లాలో చోటుచేసుకుంది.  

నర్సీపట్నం: కొద్దిరోజులుగా ఆంధ్ర ప్రదేశ్ లో మహిళలు, చిన్నారులపై వరుసగా అఘాయిత్యాలు చోటుచేసుకుంటూనే వున్నాయి. విజయవాడలో మానసిక వికలాంగురాలిపై ప్రభుత్వాస్పత్రిలోనే గ్యాంగ్ రేప్ మొదలు తాజాగా శ్రీసత్యసాయి జిల్లా గోరంట్లలో బీ ఫార్మసి యువతి ప్రియుడి పొలంలో శవంగా కనిపించడం ఇలా ప్రతిరోజూ ఏదో ఒక దారుణం వెలుగుచేస్తోంది. ఈ క్రమంలోనే గత రాత్రి బహిర్భూమికి వెళ్లిన ఓ బాలికపై యువకుడు అత్యాచారానికి పాల్పడిన ఘటన అనకాపల్లి జిల్లాలో చోటుచేసుకుంది.  

వివరాల్లోకి వెళితే... అనకాపల్లి జిల్లా నర్సీపట్నం మున్సిపాలిటీలోని 3వ వార్డులో బుద్ది సాయి(30) కుటుంబంతో కలిసి నివాసముంటున్నాయి. అతడి ఇంటిపక్కనే ఇద్దరు అక్కాచెల్లెల్లు కుటుంబంతో కలిసి నివాసముంటున్నారు. కామంతో కళ్ళు మూసుకుపోయిన సాయి అభం శుభం తెలియని ఈ చిన్నారులపై కన్నేసాడు.  

గత అర్ధరాత్రి 2 గంటల సమయలో బాలికలిద్దరూ బహిర్భూమికి వెళ్ళారు. ఇదే అదునుగా రహస్యంగా వారిని అనుసరించిన సాయి దారుణానికి ఒడిగట్టాడు. ఇద్దరిలో చిన్నదైన ఆరేళ్ల బాలికను ఎత్తుకెళ్లిన అతడు అతి దారుణంగా అత్యాచారానికి పాల్పడ్డాడు. చెల్లి కోసం ఎంత వెతికినా కనిపించకపోవడంతో మరో చిన్నారి ఇంటికి వచ్చి  కుటుంబసభ్యులకు  తెలిపింది. వెంటనే కుటుంబసభ్యులంతా చుట్టపక్కల వెతకగా ఓ చోట బాలిక తీవ్ర రక్తస్రావంతో అపస్మారక స్థితిలో కనిపించింది. 

బాలికను తల్లిదండ్రులు వెంటనే నర్సీపట్నం ఏరియా హాస్పిటల్ కు తరలించారు. బాలిక తల్లిదండ్రులు తమ పక్కింట్లో వుండే సాయి ఈ అఘాయిత్యానికి పాల్పడినట్లు పోలీసులకు ఫిర్యాదు చేసారు. వెంటనే అతడిపై  కఠిన చర్యలు తీసుకోవాలని పోలీసులను కోరారు. 

ఇదిలావుంటే శ్రీసత్యసాయి జిల్లాలో మరో దారుణం చోటుచేసుకుంది. ప్రేమిస్తున్నానంటూ నమ్మించిన యువకుడి తోటలో యువతి తీవ్ర గాయాలతో మృతిచెందడం కలకలం రేపింది. అయితే యువతిది ఆత్మహత్య కాదని... గ్యాంగ్ రేప్ చేసి చంపారంటూ బాధిత కుటుంబం ఆరోపిస్తోంది.  

ఈ దారుణం గోరంట్లలో వెలుగుచూసింది.  గోరంట్లకు చెందిన యువతి తిరుపతిలోని ఓ కాలేజీలో బీఫార్మసీ చదువుతోంది. ఈమె గోర్లంట్లలో అద్దెకుండే ఇంటికి సమీపంలో సాదిక్ అనే యువకుడు ప్రేమించుకున్నారు. వీరి ప్రేమ గురించి తెలిసి యువతి తల్లిదండ్రులు ఇంటిని ఖాళీచేసి మరో చోట అద్దెకున్నారు.  అయినప్పటికి యువతితో సాదిక్ ప్రేమాయణం కొనసాగుతూనే వుంది. 

ఏమయ్యిందో తెలీదుగానీ తిరుపతిలో వుండాల్సిన యువతి ప్రియుడు సాదిక్ ఫామ్ హౌస్ లో శవంగా తేలింది. శరీరంపై గాయాలతో ఓ షెడ్ లో ఉరేసుకుని యువతి మృతదేహం లభించింది. యువతిని  తిరుపతినుండి తీసుకువచ్చి సాదిక్ తో పాటు అతడి  స్నేహితులు సామూహిక అత్యాచారం జరిపి హత్యచేసినట్లు అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. యువతి చనిపోయాక ఉరేసి ఆత్మహత్య చేసుకున్నట్లు చిత్రీకరించే ప్రయత్నం చేస్తున్నారని  అనుమానిస్తున్నారు.  

ఆడబిడ్డపై అఘాయిత్యానికి పాల్పడిన నిందితుడు సాదిక్ ను ఎన్కౌంటర్ చేయాలంటూ పోలీస్ స్టేషన్ ముందు యువతి మృతదేహంతో బాధిత కుటుంబం, మహిళా సంఘాల  ఆందోళనకు దిగారు. బాధిత కుటుంబానికి న్యాయం చేయాలని మహిళలు డిమాండ్ చేస్తున్నారు. సాదిక్ ను పట్టుకుని విచారిస్తే గానీ యువతి మృతి మిస్టరీ వీడేలా లేదు. ప్రస్తుతం పరారీలో వున్న అతడి కోసం పోలీసులు గాలిస్తున్నారు. 
 

PREV
click me!

Recommended Stories

IMD Cold Wave Alert : తెలుగు రాష్ట్రాల్లో టెంపరేచర్స్ కుప్పకూలడానికి .. చలి బీభత్సానికి కారణమేంటో తెలుసా?
Tirupati : టీటీడీలో మరో భారీ కుంభకోణం.. నకిలీ పట్టు వస్త్రాల పేరుతో రూ.55 కోట్ల మోసం