పార్లమెంటులో చంద్రబాబునాయుడుపై వైసిపి రాజ్యసభ సభ్యుడు విజయసాయిరెడ్డి ప్రివిలేజ్ మోషన్ మూవ్ చేశారు. తనను చంద్రబాబు పదే పదే ఆర్ధిక నేరగాడని సంబోధించటంతో పాటు ప్రధానమంత్రి కార్యాలయాన్ని నేరస్తుల అడ్డాగా అభివర్ణించటంపై ఎంపి మండిపడుతున్న సంగతి తెలిసిందే. ఆ విషయంపైనే చంద్రబాబుపై ఎంపి రాజ్యసభలో ఫిర్యాదు చేశారు. విజయసాయి ఇచ్చిన ఫిర్యాదును రాజ్యసభ పరిశీలిస్తోంది.