ఆమెకు తెలియకుండానే గర్భవతిని చేసి.. అడిగితే..

Published : May 24, 2018, 12:37 PM IST
ఆమెకు తెలియకుండానే గర్భవతిని చేసి.. అడిగితే..

సారాంశం

విశాఖలో భారీ మోసం

విశాఖపట్నంలోని ఓ సంతాన సాఫల్య కేంద్రంలో భారీ మోసం బయటపడింది.  కేవలం అండం తీసుకుంటామని ఆమెకు చెప్పి.. ఆమెకు తెలియకుండానే ఆమె కడుపులోకి పిండాన్ని ప్రవేశపెట్టారు.

బాధితురాలి కథనం ప్రకారం.. శ్రీకాకుళం జిల్లా రాజాం ప్రాంతానికి చెందిన ఆదినారాయణ, నాగలక్ష్మీ దంపతులు పొట్టకూటి కోసం విశాఖపట్నానికి వచ్చారు. వీరికి ముగ్గురు పిల్లలు ఉన్నారు. విశాఖలో కూలి పనులు చేసుకునే ఈ దంపతులు కొద్ది రోజుల కిందట గొడవపడంతో ఆదినారాయణ తన సొంతూరుకి వెళ్లిపోయాడు. దీంతో ఆర్థిక ఇబ్బందులతో సతమతమవుతోన్న నాగలక్ష్మీని పక్కింట్లో ఉండే కిలారి శ్రీను అనే వ్యక్తి కుమార్తె ఉషా కలిసింది. 

అద్దె గర్భం ప్రక్రియ గురించి చెప్పి, అండాలను ఇవ్వడానికి అంగీకరిస్తే రూ.20 వేలు ఇప్పిస్తాని నమ్మించింది. దీన్ని బాధితురాలు నమ్మి, ఆమెతోపాటు అక్కయ్యపాలెంలోని పద్మశ్రీ ఆస్పత్రికి వెళ్లింది. తనను ఆస్పత్రిలోనే 15 రోజులపాటు ఉచి రక్త పరీక్షలు నిర్వహించి, ఆ తరువాత మత్తుమందు ఇచ్చి సంతకాలు చేయించుకున్నారని, నాకు మెలకువ వచ్చేసరికి కడుపులో అండాన్ని ప్రవేశపెట్టామని వైద్యులు చెప్పారని బాధితురాలు అంటోంది. అలాగే తన మొబైల్ తీసుకుని, హాస్పిటల్ భవనం రెండో అంతస్తులో నిర్బంధించి, వారం తర్వాత రూ.5 వేలు ఇచ్చారని తెలిపింది. అంతేకాదు ప్రసవం అయినంత వరకూ హాస్పిటల్‌లో ఉండాలని చెప్పారని, తర్వాత రూ.3 లక్షలు ఇస్తమన్నారని వెల్లడించింది. 

అయితే తాను అక్కడ నుంచి తప్పించుకుని, తన భర్త చెంతకు చేరుకున్నానని తెలియజేసింది. రాజాంలో ఆస్పత్రికి వెళితే పరిస్థితి విషమంగా ఉందని విశాఖ కేజీహెచ్‌కు రిఫర్ చేశారని వాపోయింది. పద్మశ్రీ హాస్పిటల్‌కు భర్తతో కలిసి వెళ్లానని, తన గర్భం తీసేయమని కోరితే అందుకు వారు నిరాకరించారు.. పైగా తననే తిరిగి రూ.3 లక్షలు చెల్లించమని బెదిరించారని బాధితురాలు పేర్కొంది. దీనిపై పోలీసులకు ఫిర్యాదు చేసి పట్టించుకోలేదని ఆవేదన వ్యక్తం చేసింది. ఈ విషయం తెలిసిన మహిళా సంఘాలు బాధితురాలికి మద్దతుగా ఆస్పత్రి వద్ద ఆందోళన నిర్వహించాయి. ఈ సందర్భంగా మహిళా సంఘాలకు, ఆస్పత్రి వర్గాలకు మధ్య వాగ్వాదం చోటుచేసుకుంది. 

PREV
click me!

Recommended Stories

చంద్రబాబు మాట్లాడుతుండగా సొమ్మసిల్లి పడిపోయిన కమాండో | Commando Collapses | Asianet News Telugu
Miss India 2020 Manasa Varanasi Visit Tirumala:తిరుమలలో మిస్ ఇండియామానస వ‌రణాసి| Asianet News Telugu