బైక్ ను ఢీ కొట్టిన లారీ.. మహిళ మృతి... !

Published : May 12, 2021, 02:48 PM IST
బైక్ ను ఢీ కొట్టిన లారీ.. మహిళ మృతి... !

సారాంశం

గుంటూరులో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. గుంటూరులోని శ్రీనగర్ మెన్ రోడ్డులో బైక్ పై వస్తున్న ఓ మహిళను లారీ డి కొట్టడంతో మహిళ అక్కడికక్కడే మృతి చెందింది.  

గుంటూరులో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. గుంటూరులోని శ్రీనగర్ మెన్ రోడ్డులో బైక్ పై వస్తున్న ఓ మహిళను లారీ డి కొట్టడంతో మహిళ అక్కడికక్కడే మృతి చెందింది.

ఈ ప్రమాదానికి రోడ్డు మధ్యలో తవ్వడమే కారణం అని తెలుస్తోంది. శ్రీనగర్ మెన్ రోడ్డులో మంచినీటి సరఫరా సమస్య వుండటంతో కొత్తగా పైపు లైన్స్ వేస్తున్నారు. దీనికి సంబంధించిన పైపులను రోడ్డు మీద అలాగే వదిలేసి కాంట్రాక్టర్లు వెళ్లిపోయారు.

ఈ మధ్యలో పనులు పూర్తిగా ఆపేశారు. పైపులైను పనులకోసం తవ్వేసి, పనులు ఆపేయడంతో రహదారి పూర్తిగా గుంటలు గా ఏర్పడింది.మరోవైపు రోడ్డుపైనే ఆక్రమణలు వుండటంతో వాహనాలు రాకపోకలకు తీవ్ర ఇబ్బందులు ఏర్పడుతున్నాయి. 

ఈ నేపథ్యంలోనే ఇలా ఓ మహిళ చనిపోవడం జరిగింది. మునిసిపల్ అధికారులు ఇకనైనా స్పందించి శ్రీనగర్, ఆరండల్ పేట 3వ అడ్డా రోడ్ పూర్తి చేయాలని కోరుతున్న శ్రీనగర్ వాసులు కోరుతున్నారు. 

PREV
click me!

Recommended Stories

Minister Savitha రక్తం ఏరులై పారించిన చరిత్ర నీది జగన్ పై మంత్రి సవిత ఆగ్రహం.. | Asianet News Telugu
Chandrababu Naidu: సంజీవిని పని తీరు అడిగితెలుసుకున్న సీఎం చంద్రబాబు| Asianet News Telugu