శాసనమండలిలో ఉద్రిక్తత: టీడీపీ, వైసీపీ మధ్య వాగ్వాదం, గ్యాలరీలో బాబు

Published : Jan 22, 2020, 06:04 PM ISTUpdated : Jan 23, 2020, 08:05 AM IST
శాసనమండలిలో ఉద్రిక్తత: టీడీపీ, వైసీపీ మధ్య వాగ్వాదం, గ్యాలరీలో బాబు

సారాంశం

శాసనమండలిలో బుధవారం నాడు తీవ్ర ఉద్రిక్తత నెలకొంది. 

అమరావతి: పాలనా వికేంద్రీకరణ, సీఆర్‌డీఏ బిల్లులను సెలెక్ట్‌ కమిటీకి పంపాలని శాసనమండలి ఛైర్మెన్ పోడియం వద్ద బుధవారం నాడు సాయంత్రం టెన్షన్ వాతావరణం నెలకొంది.

also read:శాసనమండలిలో ముగిసిన చర్చ: సెలెక్ట్ కమిటీకి టీడీపీ పట్టు, వద్దన్న వైసీపీ

సెలెక్ట్ కమిటీకి ఈ రెండు బిల్లులను పంపాలని  డిమాండ్ చేస్తూ  టీడీపీ సభ్యులు పట్టుబట్టారు. ఛైర్మెన్ పోడియం వద్ద టీడీపీ ఎమ్మెల్సీ నారా లోకేష్‌కు, మంత్రి బొత్స సత్యనారాయణ మధ్య వాగ్వాదం చోటు చేసుకొంది.  

also read: ఏపీ శాసనమండలి: అంగుళం భూమి లేదు, చేతులు జోడించి వేడుకొన్న లోకేష్

Also read:మొబైల్ చూసి నారా లోకేష్ లెక్కలు: తప్పు పట్టిన బొత్స, బుగ్గన అభ్యంతరం

మంత్రి కొడాలి నాని టీడీపీ ఎమ్మెల్సీల వైపు దూసుకు వచ్చారు. ఈ సమయంలో టీడీపీ ఎమ్మెల్సీలు కూడ మంత్రి వైపుకు దూసుకువచ్చారు. మంత్రులు రంగనాథ రాజు, పిల్లి సుభాష్ చంద్రబోస్ లు మంత్రిని వారించారు. ఇదే సమయంలో టీడీపీ ఎమ్మెల్సీ టీడీ జనార్ధన్ టీడీపీ ఎమ్మెల్సీలను వెనక్కి పంపారు.

Also read:ఏపీ అసెంబ్లీ: టీడీపీ సభ్యుల తీరుపై ఎథిక్స్ కమిటీకి స్పీకర్ సిఫారసు

Also read:బట్టలు విప్పేసి తిరుగుతానంటే ఏం చేయలేం: జేసీ సెటైర్లు

Also read:ఇద్దరు ఎమ్మెల్సీలపై అనర్హతకు టీడీపీ నోటీసులు: ఎవరీ పోతుల సునీత

Also read:మండలిలో జగన్‌కు షాక్: ఆ రెండు బిల్లులను సెలెక్ట్ కమిటీకి పంపాలని టీడీపీ నోటీసు

ఇదే సమయంలో  టీడీపీ  చీఫ్ , మాజీ ముఖ్యమంత్రి ఎమ్మెల్యేలతో కలిసి మండలి గ్యాలరీకి చేరుకొన్నారు. ఈ విషయమై మంత్రులు తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేశారు.  మండలి ఛైర్మెన్ షరీఫ్‌కు చంద్రబాబు గ్యాలరీకి రావడంపై అభ్యంతరం వ్యక్తం చేశారు.తీవ్ర ఉద్రిక్తత నెలకొనడంతో మండలిని 10 నిమిషాల పాటు మండలి ఛైర్మెన్ షరీఫ్ వాయిదా వేశారు.
 

PREV
click me!

Recommended Stories

CM Chandrababu Speech: చంద్రబాబు పంచ్ లకి పడి పడి నవ్విన నారా భువనేశ్వరి| Asianet News Telugu
Vangalapudi Anitha Strong Warning to Jagan: గుర్తుపెట్టుకో జగన్ ఎవ్వరినీ వదిలిపెట్టం |Asianet Telugu