Vizag Fishing Harbour: వైజాగ్ హార్బ‌ర్ అగ్ని ప్ర‌మాద బాధితుల‌కు రూ.7.11 కోట్ల పరిహారం

Published : Nov 24, 2023, 03:55 PM IST
Vizag Fishing Harbour: వైజాగ్ హార్బ‌ర్ అగ్ని ప్ర‌మాద బాధితుల‌కు రూ.7.11 కోట్ల పరిహారం

సారాంశం

Visakhapatnam fishing harbour: వైజాగ్ హార్బ‌ర్ అగ్ని ప్ర‌మాద బాధిత మత్స్యకారుల కుటుంబాలను ఆదుకోవడంలో ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి తక్షణమే స్పందించారని టీటీడీ మాజీ చైర్మన్‌, వైఎస్‌ఆర్సీసీ రీజినల్‌ కోఆర్డినేటర్ వైవీ సుబ్బారెడ్డి కొనియాడారు.  

Vizag Fishing Harbour Fire: వైజాగ్ లోని ఫిషింగ్ హార్బర్‌లో నవంబర్ 19న జరిగిన అగ్ని ప్రమాదంలో నష్టపోయిన మత్స్యకారుల కుటుంబాలను పూర్తి స్థాయిలో ఆదుకునేందుకు రాష్ట్ర ప్రభుత్వం కట్టుబడి ఉందని మత్స్యశాఖ మంత్రి సీదిరి అప్పలరాజు తెలిపారు. పరిహారం పంపిణీ సందర్భంగా ఏర్పాటు చేసిన సమావేశంలో ఆయన మాట్లాడుతూ రూ.7.11 కోట్ల తక్షణ సాయం అందించేందుకు యుద్ధ ప్రాతిపదికన చర్యలు తీసుకుంటున్నామన్నారు. వాగ్దానం చేసినట్లుగా బోట్ల మరమ్మతు ఖర్చులో 80 శాతం బాధిత మత్స్యకారులకు చెల్లించినట్లు ఆయన తెలిపారు.

బోటు యజమానులకు ప్రభుత్వం రూ.7,11,76,000, నష్టపోయిన మత్స్యకారులకు చెందిన 400 మంది కార్మికులకు రూ.10,000 చొప్పున పరిహారం అందించింద‌న్నారు. ప్రమాదం జరిగిన వెంటనే ప్రభుత్వం స్పందించి ఘటన జరిగిన మూడు రోజుల్లోనే పరిహారం అందజేసిందని మంత్రి తెలిపారు. ప్రభుత్వం అందిస్తున్న పలు సంక్షేమ పథకాలను సీదిరి అప్పలరాజు వివరిస్తూ మత్స్యకార భరోసా, డీజిల్‌పై సబ్సిడీ, చేపల వేటలో సాయం అందజేస్తున్నట్లు తెలిపారు. బయోడిగ్రేడబుల్ బోట్లకు ప్రోత్సాహకాలు ఇస్తామనీ, మత్స్యకారులు మెకనైజ్డ్ బోట్లను కొనుగోలు చేస్తే 75 శాతం సబ్సిడీ ఇస్తామని ప్రకటించారు. రూ.150 కోట్లతో ఫిషింగ్ హార్బర్‌ను ఆధునీకరిస్తామనీ, జీరో జెట్టీని అభివృద్ధి చేస్తామని మంత్రి తెలిపారు.

కాగా, బాధిత మత్స్యకారుల కుటుంబాలను ఆదుకోవడంలో ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి తక్షణమే స్పందించారని టీటీడీ మాజీ చైర్మన్‌, వైఎస్‌ఆర్‌సీ రీజనల్‌ కోఆర్డినేటర్‌ వైవీ సుబ్బారెడ్డి కొనియాడారు. ప్రమాదంలో నష్టపోయిన ప్రతి ఒక్కరికీ పరిహారం అందేలా చూడాలని ముఖ్యమంత్రి అధికారులను ఆదేశించారు. స్థానిక మత్స్యకారుల ఫిర్యాదు మేరకు 400 మంది మత్స్యకారులకు ఒక్కొక్కరికి రూ.10,000 చొప్పున చెల్లిస్తున్నట్లు సుబ్బారెడ్డి తెలిపారు. ప్రభుత్వం వేగంగా స్పందించినందుకు ఎంపీ మోపిదేవి వెంకటరమణ, ఎమ్మెల్యేలు వాసుపల్లి గణేష్‌కుమార్‌, ముత్తంశెట్టి శ్రీనివాసరావు, డీసీసీబీ చైర్మన్‌ కోలా గురువులు అభినందనలు తెలిపారు.

PREV
Read more Articles on
click me!

Recommended Stories

No Petrol Shortage in AP:రాష్ట్రంలో పెట్రోల్ కొరత లేదు విజయవాడ జాయింట్ కలెక్టర్| Asianet News Telugu
సచిన్ పవర్ ఫుల్ స్పీచ్ కి దద్దరిల్లిన ఆంధ్ర యూనివర్సిటీ | Andhra University Centenary Celebrations