ఇసుక అక్రమ రవాణా, అడ్డుకున్న అధికారులను చితకబాదిన గ్రామస్తులు

Siva Kodati |  
Published : May 15, 2019, 08:00 AM IST
ఇసుక అక్రమ రవాణా, అడ్డుకున్న అధికారులను చితకబాదిన గ్రామస్తులు

సారాంశం

ఏపీలో ఇసుక మాఫీయా రెచ్చిపోతోంది. ఏకంగా ప్రభుత్వోద్యోగులపైనే దాడులకు దిగింది. వివరాల్లోకి వెళితే.. శ్రీకాకుళం గ్రామీణ మండలం నైరలో ఇసుక అక్రమంగా తరలిస్తున్నారన్న సమాచారంతో రెవెన్యూ సిబ్బంది మంగళవారం రాత్రి నైర బీసీ కాలనీకి చేరుకున్నారు.

ఏపీలో ఇసుక మాఫీయా రెచ్చిపోతోంది. ఏకంగా ప్రభుత్వోద్యోగులపైనే దాడులకు దిగింది. వివరాల్లోకి వెళితే.. శ్రీకాకుళం గ్రామీణ మండలం నైరలో ఇసుక అక్రమంగా తరలిస్తున్నారన్న సమాచారంతో రెవెన్యూ సిబ్బంది మంగళవారం రాత్రి నైర బీసీ కాలనీకి చేరుకున్నారు.

లారీల్లో అక్రమంగా తరలిస్తున్న ఇసుకను అధికారులు అడ్డుకున్నారు. దీంతో నైర గ్రామస్తులు వారిపై కర్రలతో దాడికి దిగారు. ఈ ఘటనలో వీఆర్వోలు చంద్రశేఖర్, విశ్వేశ్వరరావుకు గాయాలయ్యాయి.

మిగిలిన ముగ్గురు వీఆర్వోలు దాడి నుంచి తప్పించుకున్నారు. గాయపడిన వారిని శ్రీకాకుళం ప్రభుత్వాసుపత్రికి తరలించారు. అనంతరం రెవెన్యూ అధికారులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. 

PREV
click me!

Recommended Stories

Vegetable Price : ఈ వారాంతం సంతలో కూరగాయల ధరలు ఎలా ఉండనున్నాయో తెలుసా?
IMD Cold Wave Alert : ఈ సీజన్లోనే కూలెస్ట్ మార్నింగ్స్ .. 14 జిల్లాల్లో ఆరెంజ్, 19 జిల్లాల్లో ఎల్లో అలర్ట్