సీలేరు నదిలో పడవ మునక: ఇద్దరు గల్లంతు, ఆరుగురు సురక్షితం

Published : Mar 27, 2022, 01:57 PM ISTUpdated : Mar 27, 2022, 02:21 PM IST
సీలేరు నదిలో పడవ మునక: ఇద్దరు గల్లంతు,  ఆరుగురు సురక్షితం

సారాంశం

తూర్పు గోదావరి జిల్లాలోని డొంకరాయి వద్ద సీలేరు నదిలో పడవ బోల్తా పడిన ఘటనలో ఇద్దరు గల్లంతయ్యారు.ఆరుగురు సురక్షితంగా బయటపడ్డారు.

కాకినాడ: తూర్పు గోదావరి జిల్లాలోని Sileru river నదిలో ఆదివారం నాడు పడవ బోల్తా పడింది.ఈ ఘటనలో ఇద్దరు గల్లంతయ్యారు. ఈ ప్రమాదం నుండి ఆరుగురు సురక్షితంగా బయటపడ్డారు.గల్లంతైన వారి కోసం గాలింపు చర్యలు చేపట్టారు. ప్రమాదం జరిగిన సమయంలో Boatలో ఎనిమిది మంది ఉన్నారు.

East Godavari జిల్లా Y. Ramavaram మండలం donkarai వద్ద ఈ ప్రమాదం చోటు చేసుకొంది. గల్లంతైన వారు వై.రామవరం మండలం మంగంపాడు గ్రామానికి చెందిన ఒకరు, టెలిక్యాంప్ గ్రామానికి చెందిన మరొకరుగా గుర్తించారు. విషయం తెలిసిన పోలీసులు అక్కడకు చేరుకుని ఈతగాళ్ల సాయంతో గల్లంతైన వారి కోసం గాలింపు చర్యలు చేపట్టారు. 

PREV
click me!

Recommended Stories

CM Chandrababu Naidu: నారావారిపల్లెలో అభివృద్ధిపనులు ప్రారంభించిన సీఎం| Asianet News Telugu
Bhumana Karunakar Reddy: కోనసీమ జిల్లాలో బ్లోఔట్ పై భూమన సంచలన కామెంట్స్ | Asianet News Telugu