మామిడి కాయలు కోసుకోవడానికి వెళ్తే.. మృత్యువు కబళించింది

Siva Kodati |  
Published : May 26, 2021, 06:19 PM IST
మామిడి కాయలు కోసుకోవడానికి వెళ్తే.. మృత్యువు కబళించింది

సారాంశం

విశాఖపట్నంలో దారుణం జరిగింది. చెట్టు కొమ్మలు విరిగిపడి పడి ఇద్దరు బాలురు దుర్మరణం పాలయ్యారు. తుఫాను ప్రభావంతో విశాఖ మన్యంలో భారీ గాలులు వీస్తున్నాయి. ఈ నేపథ్యంలో పాడేరు మండలం పిల్లిపుట్టు గ్రామంలో మామిడి కాయలు సేకరించేందుకు వెళ్లారు ఇద్దరు చిన్నారులు

విశాఖపట్నంలో దారుణం జరిగింది. చెట్టు కొమ్మలు విరిగిపడి పడి ఇద్దరు బాలురు దుర్మరణం పాలయ్యారు. తుఫాను ప్రభావంతో విశాఖ మన్యంలో భారీ గాలులు వీస్తున్నాయి. ఈ నేపథ్యంలో పాడేరు మండలం పిల్లిపుట్టు గ్రామంలో మామిడి కాయలు సేకరించేందుకు వెళ్లారు ఇద్దరు చిన్నారులు.

అయితే ఒక్కసారిగా భారీ ఈదురు గాలులు వీయడంతో వాటి తీవ్రతకు మామిడి చెట్టు కొమ్మలు విరిగి చిన్నారులపై పడ్డాయి. ఈ ఘటనలో మర్రి చరణ్ (13), సీదరి వినీత్ (1౦) అక్కడికక్కడే మరణించారు. వీరి మరణంతో గ్రామంలో విషాద ఛాయలు అలుముకున్నాయి. ఇందుకు సంబంధించిన మరిన్ని వివరాలు తెలియాల్సి వుంది. 
 

PREV
click me!

Recommended Stories

బంగాళాఖాతంలో అల్పపీడనం ఎఫెక్ట్..కుండపోత వర్షాలతో ఇక అల్లకల్లోలమే | AP Telangana Weather Alert
IMD Rain Alert : బంగాళాఖాతంలో అల్పపీడనం ఎఫెక్ట్.. కుండపోత వర్షాలతో అల్లకల్లోలమే, ఈ జిల్లాలకు రెడ్ అలర్ట్