మామిడి కాయలు కోసుకోవడానికి వెళ్తే.. మృత్యువు కబళించింది

By Siva KodatiFirst Published May 26, 2021, 6:19 PM IST
Highlights

విశాఖపట్నంలో దారుణం జరిగింది. చెట్టు కొమ్మలు విరిగిపడి పడి ఇద్దరు బాలురు దుర్మరణం పాలయ్యారు. తుఫాను ప్రభావంతో విశాఖ మన్యంలో భారీ గాలులు వీస్తున్నాయి. ఈ నేపథ్యంలో పాడేరు మండలం పిల్లిపుట్టు గ్రామంలో మామిడి కాయలు సేకరించేందుకు వెళ్లారు ఇద్దరు చిన్నారులు

విశాఖపట్నంలో దారుణం జరిగింది. చెట్టు కొమ్మలు విరిగిపడి పడి ఇద్దరు బాలురు దుర్మరణం పాలయ్యారు. తుఫాను ప్రభావంతో విశాఖ మన్యంలో భారీ గాలులు వీస్తున్నాయి. ఈ నేపథ్యంలో పాడేరు మండలం పిల్లిపుట్టు గ్రామంలో మామిడి కాయలు సేకరించేందుకు వెళ్లారు ఇద్దరు చిన్నారులు.

అయితే ఒక్కసారిగా భారీ ఈదురు గాలులు వీయడంతో వాటి తీవ్రతకు మామిడి చెట్టు కొమ్మలు విరిగి చిన్నారులపై పడ్డాయి. ఈ ఘటనలో మర్రి చరణ్ (13), సీదరి వినీత్ (1౦) అక్కడికక్కడే మరణించారు. వీరి మరణంతో గ్రామంలో విషాద ఛాయలు అలుముకున్నాయి. ఇందుకు సంబంధించిన మరిన్ని వివరాలు తెలియాల్సి వుంది. 
 

click me!