తిరుమలకు వచ్చే భక్తులపై ఆంక్షలు: టీటీడీ

Published : Mar 29, 2021, 07:35 PM IST
తిరుమలకు వచ్చే భక్తులపై ఆంక్షలు: టీటీడీ

సారాంశం

తిరుమల వెంకటేశ్వరస్వామిని దర్శించుకొనేందుకు వచ్చే భక్తులపై టీటీడీ ఆంక్షలు విధించింది.శ్రీవారి దర్శనం టికెట్లు ఉన్నవారికే తిరుమలకు అనుమతిస్తామని అధికారులు స్పష్టం చేశారు.

తిరుపతి: తిరుమల వెంకటేశ్వరస్వామిని దర్శించుకొనేందుకు వచ్చే భక్తులపై టీటీడీ ఆంక్షలు విధించింది.శ్రీవారి దర్శనం టికెట్లు ఉన్నవారికే తిరుమలకు అనుమతిస్తామని అధికారులు స్పష్టం చేశారు.

కరోనా వైరస్ కేసులు రాష్ట్రంలో మళ్లీ పెరుగుతున్న నేపథ్యంలో ఆంక్షలను టీటీడీ అమలు చేసింది. నడకదారి భక్తులకు ముందు రోజు ఉదయం 9 గంటల నుండి అనుమతి ఉంటుందని అధికారులు చెప్పారు.

అలాగే వాహనాల్లో వచ్చేవారికి ముందు రోజు మధ్యాహ్నం 1 గంట నుండి అనుమతి ఇస్తామని ప్రకటించారు. మరో వైపు రాష్ట్రంలో  కరోనా కేసులు పెద్ద ఎత్తున నమోదు కావడంతో  ఈ నిర్ణయం తీసుకొన్నామని అధికారులు తెలిపారు. 

గత ఏడాది కరోనా ఉధృతంగా ఉన్న సమయంలో తిరుమల స్వామివారికి ఏకాంత సేవలను నిర్వహించారు. గత ఏడాది మార్చి మాసంలోనే తిరుమల ఆలయాన్ని మూసివేశారు. 
 

PREV
click me!

Recommended Stories

ప్రెస్ మీట్ పెట్టి మరీ జగన్ పరువుతీసిన హోమ్ మంత్రి అనిత | Anitha Vangalapudi Strong Counter to Jagan
Twin Towers: ఆంధ్రప్రదేశ్‌లో అద్భుత నిర్మాణం.. 47 అంత‌స్తుల ట్విన్ ట‌వ‌ర్స్‌. ఎక్క‌డంటే.?