వాహనదారులకు టోల్ బాదుడే..

Published : Mar 31, 2018, 04:58 PM IST
వాహనదారులకు టోల్ బాదుడే..

సారాంశం

నేషనల్ అథారిటీ ఆఫ్‌ ఇండియా(ఎన్‌హెచ్‌ఏఐ) జాతీయ రహదారులపై టోల్‌ రేట్లను 5 నుంచి 7శాతం సవరించింది.

జాతీయ రహదారులపై వెళ్తున్నారా? అయితే ఇకపై మీకు మరింత బాదుడు తప్పదు. కొత్త ఆర్థిక సంవత్సరం ప్రారంభమవుతున్న సందర్భంగా నేషనల్ అథారిటీ ఆఫ్‌ ఇండియా(ఎన్‌హెచ్‌ఏఐ) జాతీయ రహదారులపై టోల్‌ రేట్లను 5 నుంచి 7శాతం సవరించింది. దీని ప్రకారం టోల్‌ రేట్లు పెరగనున్నట్లు ట్రాన్స్‌పోర్టర్లు చెబుతున్నారు.

రేట్ల పెంపుపై నేషనల్‌ హైవే-2 ప్రాజెక్ట్‌ డైరెక్టర్‌ మహ్మద్‌ సఫీ ఓ మీడియాతో మాట్లాడుతూ, దేశవ్యాప్తంగా జాతీయ రహదారులపై 372 టోల్‌ప్లాజాలు ఉన్నట్లు చెప్పారు. ఏటా ఆర్థిక సంవత్సరం ప్రారంభమయ్యే సమయంలో టోల్‌ రేట్లను సవరిస్తామన్నారు. టోకుధరల సూచీ ఆధారంగా ఈ రేట్లను సవరిస్తమని చెప్పారు. ఇవి ఒక్కో టోల్‌ ప్లాజాకు ఒక్కో రకంగా ఉంటాయట. నేషనల్‌ హైవే-2పై టోల్‌ ధరలను ఈ సారి 5శాతం పెంచామని తెలిపారు.

పెంచిన ధరలు శనివారం అర్ధరాత్రి నుంచే అమల్లోకి రానున్నాయి. చాలా ప్లాజాల్లో 5శాతం పెరగగా కొన్ని చోట్ల 7శాతం వరకు పెరిగాయి. నెలవారీ టోల్‌ పాస్‌లపై కూడా ధరలు పెరిగాయి.

PREV
click me!

Recommended Stories

JC Prabhakar Reddy Funny comments: ప్రజలతో జేసీ ప్రభాకర్ రెడ్డి పంచ్ లు | Asianet News Telugu
AP Food Commission Chairman Warning: ఈ చిల్లర పంచాయితీలు మానేయండి | Chitha Vijay Prathap Reddy