బాపట్ల జిల్లా : సముద్రంలో పడవ బోల్తా.. ముగ్గురు గల్లంతు

Siva Kodati |  
Published : Aug 20, 2023, 08:32 PM IST
బాపట్ల జిల్లా : సముద్రంలో పడవ బోల్తా.. ముగ్గురు గల్లంతు

సారాంశం

బాపట్ల జిల్లాలో పడవ బోల్తా పడిన ఘటనలో ముగ్గురు గల్లంతయ్యారు. సముద్రంలో కెరటాల ఉద్ధృతికి పడవ బోల్తా పడింది. ఈ ప్రమాదంలో సాయివర్ణిక అనే మహిళతో పాటు తనీష్, తరుణేశ్వర్‌ అనే చిన్నారులు గల్లంతయ్యారు. 

బాపట్ల జిల్లాలో విషాదం చోటు చేసుకుంది. పడవ బోల్తా పడిన ఘటనలో ముగ్గురు గల్లంతయ్యారు. నిజాంపట్నం హార్బర్ ఎంట్రన్స్ వద్ద ఈ ప్రమాదం చోటు చేసుకుంది. నాగాయలంక మండలం ఈలచెట్లదిబ్బ నుంచి ముత్తాయపాలెం వెళ్తుండగా సముద్రంలో కెరటాల ఉద్ధృతికి పడవ బోల్తా పడింది. ఈ ప్రమాదంలో సాయివర్ణిక అనే మహిళతో పాటు తనీష్, తరుణేశ్వర్‌ అనే చిన్నారులు గల్లంతయ్యారు. సమాచారం అందుకున్న పోలీసులు, రెవెన్యూ అధికారులు ఘటనాస్థలికి చేరుకుని సహాయక చర్యలు చేపట్టారు. 

PREV
click me!

Recommended Stories

Free Bus Travel : మహిళలు, దివ్యాంగులతో పాటు వీరికి కూడా ఉచిత బస్సు ప్రయాణం
వెంక‌న్న భ‌క్తుల‌కు గుడ్ న్యూస్‌.. ముంద‌స్తు బుకింగ్ లేకుండానే ప్ర‌త్యేక‌ ద‌ర్శ‌నం, నేరుగా టికెట్‌