చిత్తూరులో విషాదం: క్వారీ గుంతలో ముగ్గురి మృతదేహలు

Published : May 25, 2021, 11:08 AM IST
చిత్తూరులో విషాదం: క్వారీ గుంతలో ముగ్గురి మృతదేహలు

సారాంశం

చిత్తూరు జిల్లాలోని రామచంద్రాపురం మండలం సి. రామాపురంలోని క్వారీ గుంతలో మూడు మృతదేహాలు కలకలం సృష్టిస్తున్నాయి.

చిత్తూరు:చిత్తూరు జిల్లాలోని రామచంద్రాపురం మండలం సి. రామాపురంలోని క్వారీ గుంతలో మూడు మృతదేహాలు కలకలం సృష్టిస్తున్నాయి. రామాపురంలోని అన్నాస్వామి గండి చెరువు క్వారీ గుంతలో మూడు మృతదేహలను స్థానికులు గుర్తించారు. ఈ విషయాన్ని స్థానికులు పోలీసులకు సమాచారం ఇచ్చారు. 

క్వారీ గుంతలో ఉన్న మృతదేహాలను  నీరజ, చందు, చైత్రలుగా గుర్తించారు. ఈ ప్రాంతానికి సమీపంలోనే కంపోస్టు యార్డులో  స్కూటీని పోలీసులు గుర్తించారు. ఏపీ 03 cసీఎఫ్ 3501 అక్టివా స్కూటీగా పోలీసులు  గుర్తించారు. మృతురాలు స్విమ్స్ లో నర్సుగా పనిచేస్తోంది. మృతులు జిల్లాలోని పెనుమూరు మండలం గుండ్యాలపల్లి వాసులుగా పోలీసులు గుర్తించారు.  ప్రమాదవశాత్తు ఈ ముగ్గురు మరణించారా లేక ఎవరైనా హత్య చేసి మృతదేహలను క్వారీలో వేశారా అనే విషయమై పోలీసులు  ఆరా తీస్తున్నారు బాధిత కుటుంబసభ్యుల ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు. ఈ ఘటన స్థానికంగా కలకలం రేపింది. ముగ్గురు ఎందుకు మృతికి గల కారణాలపై పోలీసులు కుటుంబసభ్యులతో పాటు స్థానికులను  ఆరా తీస్తున్నారు. 

PREV
click me!

Recommended Stories

పిల్ల‌లు కాదు పిశాచాలు.. టీచ‌ర్‌పై దాడి చేసి ప‌దో త‌ర‌గ‌తి విద్యార్థి. వీడియో చూస్తే ఒళ్లు మండాల్సిందే.
Chintha Vijay Prathap Reddy: జగ్గయ్యపేట అంగన్వాడీ కేంద్రాలపై ఫుడ్ కమిషన్ తనిఖీ| Asianet News Telugu