లోకేష్ అరెస్ట్: తోట్లవల్లూరులో వైసీపీ ఎమ్మెల్యే ఘోరావ్, ఉద్రిక్తత

Published : Jan 07, 2020, 06:09 PM IST
లోకేష్ అరెస్ట్: తోట్లవల్లూరులో వైసీపీ ఎమ్మెల్యే  ఘోరావ్, ఉద్రిక్తత

సారాంశం

తోట్లవల్లూరులో మంగళవారం నాడు ఉద్రిక్తత చోటు చేసుకొంది.లోకేష్ అరెస్ట్ తో టీడీపీ కార్యకర్తలు, నేతలు ఆందోళనకు దిగారు. ఈ సమయంలో పోలీసులు ఎమ్మెల్యేను జాగ్రత్తగా పంపారు.

గుంటూరు: రాజదానిని అమరావతిలోనే కొనసాగించాలని డిమాండ్ చేస్తూ తోట్లవల్లూరు కరకట్ట వద్ద ఉద్రిక్తత పరిస్థితి నెలకొంది.  లోకేష్  అరెస్ట్‌ను నిరసిస్తూ రహదారిపై టీడీపీ కార్యకర్తలు ఆందోళన చేస్తున్నారు. ఆ సమయంలో అటుగా వచ్చిన వైసీపీ ఎమ్మెల్యేను టీడీపీ కార్యకర్తలు చుట్టుముట్టారు. ఎమ్మెల్యేను ఘోరావ్ చేశారు. దీంతో ఉద్రిక్తత నెలకొంది.

అభివృద్ధి కార్యక్రమాల్లో పాల్గొని తాను తిరిగి వస్తుండగా  తోట్లవల్లూరు కరకట్ట వద్దకు చేరుకొన్నారు. ఆ సమయంలో లోకేష్ అరెస్ట్ కు నిరసనగా టీడీపీ కార్యకర్తలు టైర్లు కాల్చి నిరసనలకు దిగారు. అదే సమయంలో నిరసనలకు దిగిన టీడీపీ కార్యకర్తలు వైసీపీ ఎమ్మెల్యేను చూసి ఘోరావ్ చేశారు.

ఈ సమయంలో టీడీపీ నేతలు, కార్యకర్తలు తనపై దాడికి పాల్పడేందుకు ప్రయత్నించారని ఎమ్మెల్యే అనిల్  విమర్శించారు.  ఆ తర్వాత పోలీసులు అతి కష్టం మీద  ఎమ్మెల్యే అనిల్‌ను అక్కడ నుండి పంపించారు. తనతో పాటు గన్‌మెన్‌తో పాటు  ఇద్దరు మాత్రమే ఉన్నారని ఎమ్మెల్యే అనిల్ చెప్పారు.  
 

PREV
click me!

Recommended Stories

మోసం చేసి పెళ్లి చేశారు ఆధారాలతో బయటపెట్టిన జోగి మేఘన | Jogi Meghana Pressmeet
Jogi Ramesh: రాజీవ్‌కు ఆ స‌మ‌స్య ఉంద‌ని తెలిసి మ‌రీ నా గొంతు కోశారు.. జోగి ర‌మేశ్ కోడ‌లు ఆవేద‌న