రాజధాని రచ్చ: సమావేశమైన హై పవర్ కమిటీ

By narsimha lodeFirst Published Jan 7, 2020, 5:11 PM IST
Highlights

అమరావతి సమగ్రాభివృద్ధి కోసం ఏర్పాటు చేసిన హై పవర్ కమిటీ సమావేశం మంగళవారం నాడు విజయవాడలో సమావేశమైంది. 

అమరావతి: ఏపీ రాష్ట్రాన్ని సమగ్రంగా అభివృద్ధి చేసేందుకు ఉద్దేశించిన హైపవర్ కమిటీ  మంగళవారం నాడు విజయవాడలో సమావేశమైంది. ఈ కమిటీ ఏర్పాటైన తర్వాత తొలి సమావేశం ఇదే.

ఆంధ్రప్రదేశ్  రాష్ట్ర సమగ్రాభివృద్ధి కోసం ఏర్పాటు చేసిన జీఎన్ రావు, బోస్టన్ కమిటీల నివేదికలపై అధ్యయనం చేసేందుకు ఏర్పాటు చేసింది హై పవర్ కమిటీ.. ఈ హై పవర్ కమిటీ ఈ రెండు కమిటీలు ఇచ్చిన నివేదికలపై అధ్యయనం చేయనుంది.

Also read:పిన్నెల్లి రామకృష్ణారెడ్డికి రాజధాని సెగ: గన్‌మెన్లపై పిడిగుద్దులు, రాళ్ల దాడి

ఈ నెల 20వ తేదీలోపుగా  హైలెవల్ కమిటీ  రిపోర్టును ఇవ్వనుంది.  అమరావతిలోనే రాజధానిని కొనసాగించాలనే డిమాండ్‌తో   రాజధాని ప్రాంతానికి చెందిన రైతులు 22 రోజులుగా ఆందోళనలు చేస్తున్నారు. 

Also read:రాజధాని రచ్చ: టీడీపీ నేతల హౌస్‌ అరెస్టులు, ఉద్రిక్తత

హైపవర్ కమిటీ సమావేశంలో కీలక నిర్ణయాలను సీఎం జగన్‌కు నివేదిక ఇవ్వనుంది కమిటీ. ఈ కమిటీ రిపోర్టు ఆధారంగా సీఎం జగన్ నిర్ణయం తీసుకోనున్నారు. రెండు కమిటీలు కూడ పరిపాలన వికేంద్రీకరణకు మొగ్గు చూపాయి.

also readజగన్‌కు షాక్: అమరావతి రైతుల ఆందోళన, వాస్తవాలు ఇవీ..

హైవపర్ కమిటీ సమావేశం జరుగుతున్న సమయంలోనే  కమిటీ సభ్యలను కలిసేందుకు ప్రయత్నించారు. కమిటీని కలిసేందుకు లాయర్లకు అనుమతి ఇవ్వలేదు.
 

click me!