పార్లమెంట్ ఆవరణలో టీడీపీ ఎంపీల ధర్నా

sivanagaprasad kodati |  
Published : Dec 12, 2018, 12:29 PM IST
పార్లమెంట్ ఆవరణలో టీడీపీ ఎంపీల ధర్నా

సారాంశం

పార్లమెంట్ శీతాకాల సమావేశాలు మంగళవారం నుంచి ప్రారంభమయ్యాయి. ఈ క్రమంలో విభజన చట్టంలో పొందుపరిచిన హామీల అమలు కోసం తెలుగుదేశం పార్టీ మరోసారి ఆందోళనకు సిద్ధమైంది. 

పార్లమెంట్ శీతాకాల సమావేశాలు మంగళవారం నుంచి ప్రారంభమయ్యాయి. ఈ క్రమంలో విభజన చట్టంలో పొందుపరిచిన హామీల అమలు కోసం తెలుగుదేశం పార్టీ మరోసారి ఆందోళనకు సిద్ధమైంది. ఉదయం పార్లమెంట్ ప్రారంభమైన తర్వాత సభ ఆవరణలోని గాంధీ విగ్రహం వద్ద టీడీపీ ఎంపీలు రాష్ట్రానికి ప్రత్యేక హోదా ఇవ్వాలని డిమాండ్ చేస్తూ ఫ్లకార్డులు పట్టుకుని ఆందోళన చేపట్టారు.

ఎంపీలు అశోక్ గజపతి రాజు, టీజీ వెంకటేశ్, మురళీమోహన్, శివప్రసాద్, కనకమేడల, కొనకళ్ల నారాయణ, గల్లా జయదేవ్ ఆందోళనలో పాల్గొన్నారు. మరోవైపు తిత్లీ తుఫాను కారణంగా తీవ్రంగా నష్టపోయిన శ్రీకాకుళానికి కేంద్రం విడుదల చేసిన సాయంపై చర్చించాలంటూ రూల్ 377 కింద ఎంపీ రామ్మోహన్ నాయుడు నోటీసు ఇచ్చారు. 

PREV
click me!

Recommended Stories

Success Story : మూడుసార్లు ఫెయిల్.. శత్రువుల వల్లే నాలుగోసారి సివిల్స్ ర్యాంక్ : ఓ తెలుగు ఐఏఎస్ సక్సెస్ స్టోరీ
IMD Rain Alert : తెలుగు రాష్ట్రాల్లో చలివానలు... ఏపీలో ఎనిమిది, తెలంగాణలో 23 జిల్లాలకు అలర్ట్