కరోనా రోగుల ఇంటికి తానే స్వయంగా బైక్ నడుపుకుంటూ వెళ్లి వారికి అందుకుతున్న సదుపాయాలు, ఆరోగ్య పరిస్థితి గురించి అడిగి తెలుసుకున్నారు పాలకొల్లు ఎమ్మెల్యే నిమ్మల రామానాయుడు.
పాలకొల్లు: తన నియోజకవర్గ పరిధిలో జరుగుతున్న శానిటైజేషన్ పనుల గురించి ప్రజలనే అడిగి తెలుసుకున్నారు పాలకొల్లు టిడిపి ఎమ్మెల్యే నిమ్మల రామానాయుడు. అంతేకాకుండా కరోనా సోకి హోంక్వారంటైన్ లో వుంటున్నవారి యోగక్షేమాలను కూడా కనుక్కోడానికి తానే స్వయంగా కదిలారు. కరోనా రోగుల ఇంటికి తానే స్వయంగా బైక్ నడుపుకుంటూ వెళ్లి వారికి అందుకుతున్న సదుపాయాలు, ఆరోగ్య పరిస్థితి గురించి అడిగి తెలుసుకున్నారు. బాధితులకు దైర్యం చెప్పారు. కరోనాతో ప్రజలు ప్రాణాలు కోల్పోతున్న ప్రభుత్వ యంత్రాంగం స్పందించడం లేదని నిమ్మల మండిపడ్డారు.
వీడియో