డ్రగ్స్ కేసు: విజయసాయి, ఆయన అల్లుడిపై బుద్దా వెంకన్న సంచలన వ్యాఖ్యలు

By Siva KodatiFirst Published Oct 3, 2021, 4:54 PM IST
Highlights

ఏపీలో డ్రగ్స్ దందాలో వైసీపీ ఎంపీ విజయసాయిరెడ్డి, ఆయన అల్లుడికి ప్రమేయం ఉందంటూ టీడీపీ సీనియర్ నేత బుద్ధా వెంకన్న సంచలన వ్యాఖ్యలు చేశారు. విజయసాయి అల్లుడికి ఏపీలోని అనేక పోర్టుల్లో వాటాలు ఉన్నాయని, ఆయా పోర్టుల ద్వారా డ్రగ్స్ రవాణా జరుగుతోందని వెంకన్న ఆరోపించారు

ఏపీలో డ్రగ్స్ దందాలో వైసీపీ ఎంపీ విజయసాయిరెడ్డి, ఆయన అల్లుడికి ప్రమేయం ఉందంటూ టీడీపీ సీనియర్ నేత బుద్ధా వెంకన్న సంచలన వ్యాఖ్యలు చేశారు. విజయసాయి అల్లుడికి ఏపీలోని అనేక పోర్టుల్లో వాటాలు ఉన్నాయని, ఆయా పోర్టుల ద్వారా డ్రగ్స్ రవాణా జరుగుతోందని వెంకన్న ఆరోపించారు. విజయవాడ చిరునామా ఉపయోగించుకుని ఎంతో తెలివిగా డ్రగ్స్ వ్యాపారం కొనసాగిస్తున్నారని, దీని విలువ లక్షల కోట్లలో ఉంటుందని ఆయన అన్నారు.

ఇందులో ఈ రాష్ట్ర 'బిగ్ బాస్' తో పాటు విజయసాయికి కూడా భాగం ఉందని బుద్ధా వెంకన్న ఆరోపించారు. ఈ కారణంగానే విజయసాయిరెడ్డి గత పది రోజులుగా కనిపించడంలేదని ఆయన మండిపడ్డారు. విజయసాయిని పోలీసులు కస్టడీలోకి తీసుకుని ప్రశ్నిస్తే డ్రగ్స్ భాగోతం గుట్టురట్టవుతుందని బుద్ధా వెంకన్న సూచించారు. ఈ వ్యవహారంలో ప్రజలకు జవాబు చెప్పాల్సిన బాధ్యత 'బిగ్ బాస్' పై ఉందంటూ వ్యాఖ్యానించారు. విజయసాయిరెడ్డి డ్రగ్స్ రవాణా వ్యవహారంపై 'బిగ్ బాస్' ఎందుకు స్పందించడంలేదని ప్రశ్నించారు
 

click me!