టీడీపీ ఆధ్వర్యంలో ‘‘ఆజాదీకా అమృత్ మహోత్సవాలు’’.. మూడు రోజుల పాటు వేడుకలు

Siva Kodati |  
Published : Aug 11, 2022, 09:47 PM ISTUpdated : Aug 11, 2022, 10:04 PM IST
టీడీపీ ఆధ్వర్యంలో ‘‘ఆజాదీకా అమృత్ మహోత్సవాలు’’.. మూడు రోజుల పాటు వేడుకలు

సారాంశం

తెలుగుదేశం పార్టీ ఆధ్వర్యంలో ఆజాదీకా అమృత్ మహోత్సవాలు జరగనున్నాయి. ఈ నెల 13 నుంచి 15 వరకు మూడు రోజుల పాటు వేడుకలు జరగనున్నాయి. 15న గుంటూరులో జరిగే కార్యక్రమానికి నాయకులు, కార్యకర్తలు, పార్టీ శ్రేణులు తమ వాహనాలకు జాతీయ జెండాలను మాత్రమే కట్టుకుని రావాలని చంద్రబాబు నాయుడు సూచించారు.  

భారతదేశానికి స్వాతంత్య్రం సిద్ధించి 75 వసంతాలు పూర్తి చేసుకుంటున్న శుభతరుణంలో తెలుగుదేశం పార్టీ జాతీయ అధ్యక్షులు నారా చంద్రబాబు నాయుడు పిలుపుమేరకు టీడీపీ ఆధ్వర్యంలో ఈ నెల 13 నుంచి 15వ తేదీ వరకు రాష్ట్ర వ్యాప్తంగా ఆజాదీకా అమృత్ మహోత్సవాలు ఘనంగా జరుపనున్నారు. 15న గుంటూరు స్తంబాలగరువు మెయిన్ రోడ్డులోని చేబ్రోలు హనుమయ్య ప్రాంగణంలో జరిగే ఆజాదీకా అమృత్ వేడుకల్లో ఉదయం 8.30 గంటలకు చంద్రబాబు నాయుడు జాతీయ జెండాను ఆవిష్కరించనున్నారు. అనంతరం జరిగే బహిరంగసభలో ప్రసంగిస్తారు. 13, 14, 15 తేదీలలో ప్రతి తెలుగుదేశం కార్యకర్త తమ ఇళ్లపై మువ్వన్నెల జాతీయ జెండాలు ఎగురవేయాలని చంద్రబాబు నాయుడు పిలుపు ఇచ్చారు. దేశంపై తమ బాధ్యతను, దేశభక్తిని చాటాలని ఆయన పేర్కొన్నారు. 15న గుంటూరులో జరిగే కార్యక్రమానికి నాయకులు, కార్యకర్తలు, పార్టీ శ్రేణులు తమ వాహనాలకు (పార్టీ  జెండాలతో కాకుండా)  జాతీయ జెండాలను మాత్రమే కట్టుకుని రావాలని చంద్రబాబు నాయుడు సూచించారు.

అంతకుముందు 75 years of independence: భారత జాతీయ జెండాలో మూడు రంగులు మాత్రమే ఉండవని, ఇది మన integrity, వర్తమానం పట్ల మన నిబద్ధత, భవిష్యత్తు గురించి మన కలల ప్రతిబింబమని ప్రధాని నరేంద్ర మోడీ అన్నారు. సూరత్‌లో జరిగిన తిరంగా ర్యాలీని ఉద్దేశించి వీడియో కాన్ఫరెన్స్ ద్వారా ప్రసంగించిన ప్రధాని మోడీ కొద్ది రోజుల్లోనే భారతదేశానికి స్వాతంత్య్రం వచ్చి 75 ఏళ్లు పూర్తవుతున్నాయని గుర్తు చేశారు. భారతదేశం నలుమూలలా త్రివర్ణ పతాకాన్ని రెపరెపలాడిస్తున్నందున మనమందరం ఈ చారిత్రాత్మక స్వాతంత్య్ర‌ దినోత్సవానికి సిద్ధమవుతున్నామని అన్నారు. గుజరాత్‌లోని ప్రతి మూల కూడా ఉత్సాహంతో నిండిపోయిందని, సూరత్ దాని కీర్తిని మరింత పెంచిందని ప్రధాని వ్యాఖ్యానించారు.

Also Read:త్రివర్ణ పతాకం భారతదేశ ఐక్యత, సమగ్రత, భిన్నత్వానికి చిహ్నం: ప్రధాని మోడీ

దేశం మొత్తం దృష్టి నేడు సూరత్‌పైనే ఉందని.. సూరత్‌ తిరంగ యాత్రలో ఓ విధంగా మినీ ఇండియా కనిపిస్తోందని.. సమాజంలోని అన్ని వర్గాల ప్రజలు కలిసికట్టుగా ఇందులో పాలుపంచుకుంటున్నారని అన్నారు. త్రివర్ణ పతాకం నిజమైన ఏకీకరణ శక్తిని సూరత్ చూపించిందని ప్రధాని మోడీ అన్నారు. సూరత్ తన వ్యాపారం, పరిశ్రమల కారణంగా ప్రపంచంపై ఒక ప్ర‌త్యేక‌ ముద్ర వేసినప్పటికీ, ఈ రోజు తిరంగా యాత్ర ప్రపంచం మొత్తం దృష్టి కేంద్రీకరిస్తుందని పేర్కొన్నారు.  తిరంగా యాత్ర‌లో మ‌న స్వాతంత్య్ర‌ పోరాట స్ఫూర్తిని స‌జీవంగా చూపిన సూర‌త్ ప్ర‌జ‌ల‌కు అభినంద‌న‌లు తెలిపారు. "ఒక బట్టల అమ్మేవాడు, దుకాణదారుడు, ఎవరో మగ్గాల హస్తకళాకారుడు, ఎవరైనా కుట్టు-ఎంబ్రాయిడరీ కళాకారులు, మరొకరు రవాణాలో ఉన్నారు, వారందరూ దీంతో కనెక్ట్ అయ్యారు" అని చెప్పారు. దీన్ని గొప్ప కార్యక్రమంగా మార్చిన సూరత్‌లోని మొత్తం వస్త్ర పరిశ్రమ కృషిని మోడీ అభినందించారు.

PREV
Read more Articles on
click me!

Recommended Stories

Andhra Pradesh Legislative Council: తిరుమల నెయ్యి కల్తీ పైఅసెంబ్లీ లో రచ్చ రచ్చ | Asianet Telugu
CM Chandrababu Speech: ఏపీ ప్రాజెక్టులపై అసెంబ్లీలో చంద్రబాబు పవర్ ఫుల్ స్పీచ్| Asianet News Telugu