పరిషత్ ఎన్నికలపై ఏపీ ఎస్ఈసీ మీటింగ్: టీడీపీ, బీజేపీ, జనసేన బహిష్కరణ

Published : Apr 02, 2021, 11:28 AM ISTUpdated : Apr 02, 2021, 11:36 AM IST
పరిషత్ ఎన్నికలపై ఏపీ ఎస్ఈసీ మీటింగ్: టీడీపీ, బీజేపీ, జనసేన బహిష్కరణ

సారాంశం

ఆంధ్రప్రదేశ్  రాష్ట్ర ఎన్నికల సంఘం నిర్వహిస్తున్న అఖిలపక్ష సమావేశానికి ప్రధాన పార్టీలు ఈ సమావేశాన్ని బహిష్కరించాయి.    

అమరావతి: ఆంధ్రప్రదేశ్  రాష్ట్ర ఎన్నికల సంఘం నిర్వహిస్తున్న అఖిలపక్ష సమావేశానికి ప్రధాన పార్టీలు ఈ సమావేశాన్ని బహిష్కరించాయి.  అఖిలపక్ష సమావేశం నిర్వహించడానికి ముందే పరిషత్ ఎన్నికల నిర్వహణకు సంబంధించి నోటిఫికేషన్ జారీ చేయడంపై ప్రధాన పార్టీలు  తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేస్తున్నాయి. 

 

ఎన్నికల విషయమై చర్చించాలని సమావేశాన్ని ఏర్పాటు చేసి అంతకుముందే ఎలా ఎన్నికల నిర్వహణకు సంబంధించి నోటిఫికేషన్ ఎలా జారీ చేస్తారని ప్రశ్నించారు.ఎన్నికల సంఘం వ్యవహరిస్తున్న తీరును నిరసిస్తూ టీడీపీ, జనసేన, బీజేపీలు ఈ సమావేశాన్ని బహిష్కరించాయి.

ఎన్నికల సంఘం వ్యవహరిస్తున్న తీరును నిరసిస్తూ టీడీపీ, జనసేన, బీజేపీలు ఈ సమావేశాన్ని బహిష్కరించాయి.ఈ సమావేశానికి వైసీపీ, కాంగ్రెస్, సీపీఎం ల ప్రతినిధులు హాజరయ్యారు. సమావేశానికి హాజరైన పార్టీల ప్రతినిధులు పరిషత్ ఎన్నికల నిర్వహణపై   ఎస్ఈసీకి సూచనలు చేసే అవకాశం ఉంది.. కరోనా విషయంలో కూడ పార్టీల ప్రతినిధులు కూడ ఎస్ఈసీతో పార్టీల నేతలు చర్చించే అవకాశం ఉంది .

 

PREV
click me!

Recommended Stories

Perni Nani press meet: మోయ‌లేని గుదిబండగా అమ‌రావ‌తి చంద్రబాబుపై పేర్నినాని సెటైర్లు | Asianet Telugu
Raghurama KrishnamRaju: మావాళ్లని మోసం చేయొద్దు | Update on Akividu Ramalayam | Asianet News Telugu