మోడీతో ఆ నలుగురు ఎంపీల భేటీ

Published : Jun 21, 2019, 12:39 PM IST
మోడీతో  ఆ నలుగురు ఎంపీల భేటీ

సారాంశం

టీడీపీని వీడి బీజేపీలో చేరిన నలుగురు ఎంపీలు శుక్రవారం నాడు ప్రధానమంత్రి నరేంద్ర మోడీతో భేటీ అయ్యారు.రాజ్యసభలో టీడీపీపీని బీజేపీలో విలీనం చేయాలని కోరుతూ రాజ్యసభ చైర్మెన్  వెంకయ్యనాయుడుకు  ఈ నలుగురు ఎంపీలు గురువారం సాయంత్రం లేఖ ఇచ్చారు.

న్యూఢిల్లీ: టీడీపీని వీడి బీజేపీలో చేరిన నలుగురు ఎంపీలు శుక్రవారం నాడు ప్రధానమంత్రి నరేంద్ర మోడీతో భేటీ అయ్యారు.రాజ్యసభలో టీడీపీపీని బీజేపీలో విలీనం చేయాలని కోరుతూ రాజ్యసభ చైర్మెన్  వెంకయ్యనాయుడుకు  ఈ నలుగురు ఎంపీలు గురువారం సాయంత్రం లేఖ ఇచ్చారు.

అనంతరం ఈ నలుగురు ఎంపీలు బీజేపీలో చేరారు.బీజేపీలో చేరిన నలుగురు ఎంపీలు సుజనా చౌదరి, సీఎం రమేష్, టీజీ వెంకటేష్, గరికపాటి మోహన్ రావులు శుక్రవారం నాడు ప్రధానమంత్రి మోడీతో భేటీ అయ్యారు.

గత టర్మ్‌లో టీడీపీ, బీజేపీలు మిత్రపక్షాలుగా ఉన్నాయి. ఈ సమయంలో మోడీ కేబినెట్‌లో సుజనా చౌదరి మంత్రిగా కొనసాగారు.  మోడీ కేబినెట్ నుండి టీడీపీ వైదొలిగింది. ఈ సమయంలో కేబినెట్ నుండి వైదొలగడాన్ని సుజనా చౌదరి వ్యతిరేకించారు. మంత్రివర్గం నుండి  వైదొలిగినా.... కనీసం ఎన్డీఏలో కొనసాగాలని సుజనా చౌదరి చంద్రబాబుకు సూచించారు. కానీ,టీడీపీ ఎన్డీఏ నుండి కూడ బయటకు వచ్చింది.

ఈ ఏడాది ఏప్రిల్ 11వ తేదీన ఏపీ అసెంబ్లీకి జరిగిన ఎన్నికల్లో వైసీపీ ఘన విజయం సాధించింది. టీడీపీ 23 స్థానాలకే పరిమితమైంది.  3 ఎంపీ స్థానాలను మాత్రమే ఆ పార్టీకి దక్కాయి. వైసీపీ 151 ఎమ్మెల్యేలు, 22 ఎంపీ స్థానాలను కైవసం చేసుకొంది. ఎన్నికల ఫలితాలతో టీడీపీ ఎంపీలు నిరాశకు లోనయ్యారు. సుజనా చౌదరి నేతృత్వంలో  నలుగురు ఎంపీలు బీజేపీలో చేరారు. 
 

PREV
click me!

Recommended Stories

CM Chandrababu Massive Speech | స్టేజిని షేక్ చేసిన Chandrababu | Asianet Telugu
Bonda Uma ని చూసి CM Chandrababu Reaction చూడండి | Asianet Telugu