కర్రలు, పీవీసీ పైపులతో చావబాది.. ఆపై ఐరన్ బాక్స్‌తో వాతలు... విద్యార్ధిపై సహచరుల దాడి

By Siva KodatiFirst Published Nov 4, 2022, 3:23 PM IST
Highlights

పశ్చిమ గోదావరి జిల్లా భీమవరం ఎస్ఆర్‌కేఆర్ ఇంజనీరింగ్ కాలేజీలో విద్యార్ధుల మధ్య ఘర్షణ చోటు చేసుకుంది.  హాస్టల్ రూమ్‌లో అంకిత్ అనే విద్యార్ధిపై కర్రలు, పీవీసీ పైపులతో దాడి చేశారు సహచరులు. 

పశ్చిమ గోదావరి జిల్లా భీమవరం ఎస్ఆర్‌కేఆర్ ఇంజనీరింగ్ కాలేజీలో విద్యార్ధుల మధ్య ఘర్షణ చోటు చేసుకుంది.  హాస్టల్ రూమ్‌లో అంకిత్ అనే విద్యార్ధిపై కర్రలు, పీవీసీ పైపులతో దాడి చేశారు సహచరులు. వాటితో విచక్షణారహితంగా కొట్టారు. ఐరన్ బాక్సుతో అతని ఛాతీపై వాతలు పెట్టారు. ఈ ఘటనలో తీవ్రంగా గాయపడ్డ అంకిత్ ప్రస్తుతం భీమవరం ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నాడు. దీనికి సంబంధించిన మరిన్ని వివరాలు తెలియాల్సి వుంది. 
 

click me!