
శ్రీకాకుళం జిల్లాలో కలెక్టర్ సుడిగాలి పర్యటన నిర్వహించారు. అకస్మాత్తుగా చేసిన తనిఖీలతో షాపుల యజమానులు పరుగు పెట్టారు. ప్రభుత్వ నిబంధనలు, ధరల పట్టికలు, పరిశుభ్రత అంశాలపై కలెక్టర్ ప్రత్యేక దృష్టి సారించారు. నిబంధనలు పాటించని వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. ఈ సడెన్ ఇన్స్పెక్షన్ స్థానిక వ్యాపారుల్లో చర్చనీయాంశమైంది.