South Central Railway: భద్రతా పనుల కారణంగా పలు రైళ్ల రద్దు.. వివరాలు ఇవిగో

Published : Nov 05, 2023, 12:33 AM IST
South Central Railway: భద్రతా పనుల కారణంగా పలు రైళ్ల రద్దు.. వివరాలు ఇవిగో

సారాంశం

South Central Railway: రైలు నంబర్ 17240 విశాఖపట్నం-గుంటూరు సింహాద్రి ఎక్స్‌ప్రెస్ కొన్ని భద్రతా పనుల కారణంగా నవంబర్ 7 నుండి నవంబర్ 13 వరకు తాత్కాలికంగా రద్దు చేశారు. దీంతో పాటు మరికొన్ని రైలు స‌ర్వీసుల‌ను తాత్కాలికంగా ర‌ద్దు చేస్తున్న‌ట్టు ద‌క్షిణ మ‌ధ్య రైల్వే విజ‌య‌వాడ డివిజ‌న్ అధికారులు ప్ర‌క‌టించారు.  

Visakhapatnam: అవసరమైన భద్రతా పనుల కారణంగా దక్షిణ మధ్య రైల్వే విజయవాడ డివిజన్‌లో పలు రైళ్ల సర్వీసులను తాత్కాలికంగా రద్దు చేశారు. ప్రయాణికులు ఈ విష‌యాన్ని దృష్టిలో ఉంచుకుని త‌మ ప్రయాణాల‌ను ప్లాన్ చేసుకోవాల‌ని సంబంధిత అధికారులు సూచించారు. ద‌క్షిణ మ‌ధ్య రైల్వే విజ‌య‌వాడ డివిజ‌న్ ప్ర‌క‌టించిన రైద్దు చేయ‌బ‌డిన రైళ్ల వివ‌రాలు ఇలా ఉన్నాయి.. 

1. రైలు నంబ‌ర్ 17239 గుంటూరు-విశాఖపట్నం సింహాద్రి ఎక్స్‌ప్రెస్: గుంటూరు నుండి విశాఖపట్నం మార్గంలో న‌డుస్తుంది. దీని స‌ర్వీసుల‌ను నవంబర్ 6 నుండి నవంబర్ 12 వరకు ర‌ద్దు చేస్తున్న‌ట్టు రైల్వే అధికారులు తెలిపారు.

2. రైలు నెంబ‌ర్ 17240 విశాఖపట్నం-గుంటూరు సింహాద్రి ఎక్స్‌ప్రెస్: విశాఖపట్నం నుండి గుంటూరు మ‌ధ్య న‌డుస్తుంది. ఈ ట్రైన్ సేవ‌లు నవంబర్ 7 నుండి నవంబర్ 13 వరకు ర‌ద్దు చేశారు. 

3. రైలు నెంబ‌ర్ 07466 రాజమండ్రి-విశాఖపట్నం మెము స్పెషల్ ఎక్స్‌ప్రెస్: రాజమండ్రి నుండి విశాఖపట్నం మ‌ధ్య న‌డుస్తుంది. నవంబర్ 6 నుండి నవంబర్ 12 వరకు ఈ రైలు సేవ‌లు ర‌ద్దు చేశారు.

4. రైలు నెంబ‌ర్  07467 విశాఖపట్నం-రాజమండ్రి మెము స్పెషల్ ఎక్స్‌ప్రెస్: విశాఖపట్నం నుండి రాజమండ్రి రూట్ లో న‌డిచే ఈ రైలు సేవ‌లు నవంబర్ 6 నుండి నవంబర్ 12 వరకు తాత్కాలికంగా నిలిపివేస్తున్న‌ట్టు రైల్వే అధికార వ‌ర్గాలు తెలిపాయి.

PREV
Read more Articles on
click me!

Recommended Stories

వెంక‌న్న భ‌క్తుల‌కు గుడ్ న్యూస్‌.. ముంద‌స్తు బుకింగ్ లేకుండానే ప్ర‌త్యేక‌ ద‌ర్శ‌నం, నేరుగా టికెట్‌
తిరుమల లడ్డూను చెక్ చేసేందుకు 'ఇ-నోస్' ఇ-టంగ్'.. ఎలా పనిచేస్తాయో తెలుసా..?