
విజయవాడ: ఉమ్మడి కృష్ణా జిల్లాకు చెందిన Techie Swtha Chowdary ఆత్మహత్యకు సైబర్ నేరగాళ్లు మోసం చేయడమే కారణమని పోలీసులు అనుమానిస్తున్నారు.ఈ విషయమై తమ దర్యాప్తులో పోలీసులు గుర్తించారని ప్రముఖ తెలుగు న్యూస్ చానెల్ ఎన్టీవీ తెలిపింది.ఈ మేరకు ఎన్టీవీ కథనం ప్రసారం చేసింది.
ఎన్టీఆర్ జిల్లా Jaggayyapet సమీపంలోని చిల్లకల్లు చెరువులో దూకి టెక్కీ శ్వేత suicide చేసుకుంది. ఈ నెల 2న శ్వేత చౌదరి ఆత్మహత్యక పాల్పడింది. ఆన్ లైన్ లో ఉండే శ్వేత కు అపరిచిత వ్యక్తి పరిచయమయ్యాడు. రూ. 1.20 లక్షలు చెల్లిస్తే రూ. 7 లక్షలు ఇప్పిస్తానని చెప్పాడు. అయితే తన వద్ద అంత డబ్బు లేదని శ్వేత అతనికి చెప్పింది. అయితే అతనే ఆమెకు రూ. 50 వేలు చెల్లించాడు.
దీంతో మరో రూ. 50 వేలు కలిపి ఆమె లక్ష రూపాయాలు అతడికి పంపింది. దీనికి తోడు మరికొంత డబ్బును కూడా Cyber Cheater టెక్కీ శ్వేత నుండి తీసుకున్నారు. ఆమెకు చెప్పినట్టుగా రూ. 7 లక్షలు పంపలేదు. దీంతో తాను మోసపోయినట్టుగా భావించిన టెక్కీ చెరువులో దూకి ఆత్మహత్యుకు పాల్పడిందని పోలీసులు తమ దర్యాప్తులో గుర్తించారని ఎన్టీవీ కథనంలో తెలిపింది. ఆన్ లైన్ లో శ్వేత ఎవరెవరితో చాటింగ్ చేసిందనే విషయాలపై పోలీసులు ఆరా తీస్తున్నారు.
తాను సైబర్ చీటర్స్ చేతిలో మోసపోవడంతో మనోవేదనక గురై ఆత్మహత్యకు పాల్పడినట్టుగా పోలీసులు అనుమానిస్తున్నారు. శ్వేత సోషల్ మీడియా ఖాతాల ఆధారంగా పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.