ఆర్టీసీ బస్సులో మంటలు.. ప్రయాణికులు సురక్షితం

Published : Oct 13, 2018, 04:44 PM IST
ఆర్టీసీ బస్సులో మంటలు.. ప్రయాణికులు సురక్షితం

సారాంశం

ఊహించని ఈ పరిణామంతో ప్రయాణికులు భయబ్రాంతులకు గురయ్యారు. బస్సు డ్రైవర్ అప్రమత్తమవ్వడంతో బస్సు వెంటనే ఆపారు. 

కడప జిల్లాలో శనివారం ఓ పెను ప్రమాదం తప్పింది.  కడప జిల్లా రాయచోటి నుంచి తిరుపతి వెళ్లే ఆర్టీసీ బస్సులో అకస్మాత్తుగా మంటలు చెలరేగాయి. సంబేపల్లి మండలం దేవపట్ల బస్ స్టాప్ వద్ద ఈ ఘటన చోటుచేసుకుంది.  ఊహించని ఈ పరిణామంతో ప్రయాణికులు భయబ్రాంతులకు గురయ్యారు. బస్సు డ్రైవర్ అప్రమత్తమవ్వడంతో బస్సు వెంటనే ఆపారు. ప్రయాణికులందరూ కిందకి దిగిపోవడంతో పెను ప్రమాదం తప్పింది. ఇంత పెద్ద ప్రమాదం నుంచి బయటపడినందుకు వారంతా ఒక్కసారిగా ఊపిరిపీల్చుకున్నారు. బస్సు మాత్రం సగానికి పైగా కాలిపోయింది.  అసలు మంటలు చెలరేగానికి మాత్రం కారణం తెలియరాలేదు. 

PREV
click me!

Recommended Stories

లోకేష్ పంచ్ లకి పడి పడి నవ్విన టీచర్స్ Nara Lokesh Meets Teachers Returned from Singapore Study Tour
ఇలా చేస్తే ఒక్క క్లిక్ తో ఏ సబ్జెక్టువీక్ ఉన్నాడో ఈజీగా తెలిసిపోతుంది | Nara Lokesh Meets Teachers