వైసిపి ఎమ్మెల్యే జోగి రమేష్ ఇంట్లో చోరీ... రూ.18లక్షలు ఎత్తుకెళ్లిన దుండగలు

Published : Feb 09, 2021, 11:00 AM IST
వైసిపి ఎమ్మెల్యే జోగి రమేష్ ఇంట్లో చోరీ... రూ.18లక్షలు ఎత్తుకెళ్లిన దుండగలు

సారాంశం

కృష్ణా జిల్లా పెడన ఎమ్మెల్యే జోగి రమేష్ నివాసంలో అర్థరాత్రి 12 గంటల సమయంలో ఈ దోపిడి జరిగినట్లు తెలుస్తోంది. 

విజయవాడ: అధికార వైసిపి ఎమ్మెల్యే జోగి రమేష్ ఇంట్లో నిన్న(సోమవారం) అర్దరాత్రి దొంగలుపడ్డాయి. కృష్ణా జిల్లా పెడనలోని ఆయన నివాసంలో అర్థరాత్రి 12 గంటల సమయంలో ఈ దోపిడి జరిగినట్లు తెలుస్తోంది. ఇంట్లోకి చొరబడ్డు దొంగలు దాదాపు రూ.18లక్షల మేర నగదు దోచుకున్నట్లు పోలీసులు ప్రాథమికంగా నిర్దారించారు.   

దొంగతనం జరిగినట్లు గుర్తించిన ఎమ్మెల్యే కుటుంబసభ్యులు పోలీసులకు సమాచారం అందించారు. దీంతో కేసు నమోదు చేసుకున్న పోలీసులు దొంగల కోసం గాలింపు చేపట్టారు. ఈ దోపిడికి సంబంధించిన పూర్తి వివరాలు ఇంకా తెలియాల్సి వుంది. 
 

PREV
click me!

Recommended Stories

Government Jobs : తెలుగు యువతకు ఇదే కరెక్ట్ టైమ్.. గట్టిగా ట్రై చేస్తే డిప్యూటీ కలెక్టర్లు, డిఎస్పిలు అయిపోవచ్చు
Heavy Rain Alert: ద్రోణి ప్రభావంతో పిడుగులు, ఈదురుగాలులతో భారీ వర్షాలు.. ఏపీ, తెలంగాణకు ఐఎండీ అలర్ట్