కృష్ణా జిల్లాలో రోడ్డు ప్రమాదం... ట్రావెల్స్ బస్సు, లారీ ఢీ, నలుగురికి తీవ్ర గాయాలు

Arun Kumar P   | Asianet News
Published : Aug 26, 2021, 09:43 AM IST
కృష్ణా జిల్లాలో రోడ్డు ప్రమాదం... ట్రావెల్స్ బస్సు, లారీ ఢీ, నలుగురికి తీవ్ర గాయాలు

సారాంశం

హైదరాబాద్ నుండి యానాం వెళుతున్న ఓ ప్రైవేట్ ట్రావెెల్ బస్సు కృష్ణా జిల్లాలో రోడ్డు ప్రమాదానికి గురయ్యింది. ఈ ప్రమాదంలో నలుగురు తీవ్రంగా గాయపడ్డారు.  

కృష్ణా జిల్లా నందిగామ మండలం అనాసాగరం బైపాస్‌లో రోడ్డులో రెండు భారీ వాహనాలు ప్రమాదానికి గురయ్యాయి. వేగంగా వెళుతున్న ఓ ప్రైవేట్ బస్సు‌-లారీ ఎదురెదురుగా వచ్చి ఢీకొన్నాయి. ఈ ప్రమాదంలో నలుగురు తీవ్రంగా గాయపడ్డారు. 

వివరాల్లోకి వెళితే... తెలంగాణ రాజధాని హైదరాబాద్ నుండి యానాంకు 38మంది ప్రయాణికులతో ఓ ప్రైవేట్ బస్సు యానాంకు బయలుదేరింది. ఈ క్రమంలో బస్సు నందిగామ మండలం అనాసాగరం బైపాస్ రోడ్డులో వెళుతూ ప్రమాదానికి గురయ్యింది. వేగంగా వెళుతున్న బస్సు ఓ లారీని ఢీకొట్టింది. 

read more  ఆస్తి కోసం గొడవ.. బాబాయ్ ని చంపేసి.. తానే హత్య చేశానంటూ..!

ఈ ప్రమాదంలో బస్సులో ప్రయాణిస్తున్నవారిలో నలుగురు తీవ్రంగా గాయపడ్డారు.  మరికొందరు కూడా స్వల్పంగా గాయపడ్డారు. ప్రమాదం జరిగిన వెంటనే స్పందించిన స్థానికులు క్షతగాత్రులకు ఆస్పత్రికి తరలించారు.  

ప్రమాదం గురించి విషయం తెలుసుకున్న పోలీసులు వెంటనే ఘటన స్థలానికి చేరుకుని పరిశీలించారు. ఈ ప్రమాదం గురించి ప్రయాణికుల నుండి వివరాలు సేకరించారు. అనంతరం కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. 
 

PREV
click me!

Recommended Stories

పిల్ల‌లు కాదు పిశాచాలు.. టీచ‌ర్‌పై దాడి చేసి ప‌దో త‌ర‌గ‌తి విద్యార్థి. వీడియో చూస్తే ఒళ్లు మండాల్సిందే.
Chintha Vijay Prathap Reddy: జగ్గయ్యపేట అంగన్వాడీ కేంద్రాలపై ఫుడ్ కమిషన్ తనిఖీ| Asianet News Telugu