ఏపీలో నలుగురు మత్య్సకారుల ఆచూకీ గల్లంతు: కొనసాగుతున్న గాలింపు చర్యలు

Published : Jul 06, 2022, 11:20 AM ISTUpdated : Jul 06, 2022, 12:02 PM IST
ఏపీలో నలుగురు మత్య్సకారుల ఆచూకీ గల్లంతు:  కొనసాగుతున్న గాలింపు చర్యలు

సారాంశం

ఉమ్మడి కృష్ణా జిల్లాలో చేపల వేటకు వెళ్లిన నలుగురు మత్స్యకారుల ఆచూకీ ఇంకా లభ్యం కాలేదు. ఈ నలుగురు మత్య్సకారుల ఆ,చూకీ కోసం రెస్క్యూ టీమ్ గాలింపు చర్యలు చేపట్టారు. ఐదు రోజులుగా చేపల వేటకు వెళ్లిన మత్య్యకారుల ఆచూకీ  లేకుండా పోయింది. 

విజయవాడ: ఉమ్మడి Krishna  జిల్లాకు చెందిన  Four  మత్స్యకారుల ఆచూకీ ఇంకా లభ్యం కాలేదు. Fish వేటకు వెళ్లిన Fishermen ఇంటికి తిరిగి రాలేదు. తమ Boat  పాడైందని కుటుంబ సభ్యులకు సమాచారం ఇచ్చారు. మత్స్యకారుల వద్ద ఉన్న phone కూడా స్విచ్ఛాఫ్ అయి ఉంటాయని పోలీసులు అనుమానిస్తున్నారు.  రెండు రోజులుగా తప్పిపోయిన మత్స్యకారుల కోసం పోలీసులు, రెస్క్యూటీమ్ గాలింపు చర్యలు చేపట్టాయి.

Ambekar konaseema  జిల్లాకు చెందిన అంతర్వేదికి చెందిన మత్స్యకారులు ఐదు రోజుల క్రితం  బంగాళాఖాతంలో చేపల వేటకు వెళ్లారు. మత్స్యకారులు ఈ నెల 3వ తేదీ వరకు కుటుంబ సభ్యులతో మత్స్యకారులు టచ్ లో ఉన్నారు. తాము ఒడ్డుకు దగ్గరలో ఉన్నామని చెప్పారు. అయితే తాము ఒడ్డుకు చేరుకోవడానికి బోటు ఇంజన్ పాడైందని వారు తెలిపారు.

మోకా వెంకటేశ్వరరావు, విశ్వనాథపల్లి చినమస్తాన్, రామాని నాంచార్లు, చెక్క. నరసింహరావుల ఆచూకీ కోసం కుటుంబ సభ్యులు ఆందోళన చెందుతున్నారు.

 Bay of Bengal సముద్రంలో వేటకు వెళ్లి ఆచూకీ లేకుండా పోయిన నలుగురు మత్సకారుల కోసం బంధువులు, స్నేహితులు కూడా గాలింపు చర్యలు చేపట్టారు. అయితే ఆచూకీ లభ్యం కాలేదు. ఆచూకీ లేకుండా పోయిన మత్స్యకారుల కోసం పోలీసులు టెక్నాలజీని ఉపయోగిస్తున్నారు. గల్లంతైన మత్స్యకారుల ఆచూకీని తెలుసుకొనేందుకు గాను పోలీసులు ప్రయత్నాలు చేస్తున్నారు.  మత్స్యకారులు ఉపయోగించిన సెల్ ఫోన్ల లోకేషన్లను ట్రేస్ చేసే ప్రయత్నం చేస్తున్నారు.

also read:మచిలీపట్నంలో విషాదం... సముద్రంలో నలుగురు మత్స్యకారులు గల్లంతు

 మత్స్యకారులు ఉపయోగించిన ఫోన్ ఐఎంఈఐ కి ఐటీ కోర్ నుంచి బ్లాంక్ మేసేజ్ పంపారు పోలీసులు.ఈ నెల 5వ తేదీన ఉదయం మేసేజ్ పంపితే రాత్రి 11 గంటలకు మేసేజ్ వెళ్లింది.ఈ మేసేజ్ వెళ్లిన ఫోన్  లోకేషన్ ను పోలీసులు ట్రేస్ చేసే ప్రయత్నం చేస్తున్నారు. హెలికాప్టర్ తో పాటు బోట్ల సహాయంతో మత్స్యకారుల కోసం పోలీసులు, రెస్యూటీమ్ గాలింపు చర్యలు చేపట్టారు.

జిల్లాలోని క్యాంబెల్ పేటకు చెందిన మత్స్యకారులు సముద్రంలో చేపల వేటకు వెళ్లారు.  చేపల వేటకు వెళ్లిన బోటు ఇంజన్ పాడు కావడంతో వారంతా సముద్రంలోనే ఇబ్బందిపడుతున్నారని బాధిత కుటుంబ సభ్యులు చెబుతున్నారు.ఈ విషయాలను వారు తమతో చివరి సారిగా ఫోన్ లో మాట్లాడిన సమయంలో చెప్పారనన్నారుు. ఏడు బోట్లు, ఒక నేవీ హెలికాప్టర్ సహాయంతో నలుగురు మత్స్యకారుల కోసం సహాయక బృందాలు గాలింపు చర్యలు చేపట్టారు.

PREV
click me!

Recommended Stories

Palla Srinivas Rao Speech: అక్కడ దౌర్జన్యం చేస్తూ డబ్బులు వసూళ్లు | Asianet News Telugu
Vishnu Kumar Raju Speech: వీటిపై ఇంత తక్కువ డబ్బు కేటాయించడం నేనెప్పుడూచూడలేదు | Asianet News Telugu