కోవిడ్ సెంటర్‌లో మెడికల్ సర్వీసెస్‌దే మా బాధ్యత: రమేష్ ఆసుపత్రి ఎండీ

Published : Aug 10, 2020, 02:37 PM IST
కోవిడ్ సెంటర్‌లో మెడికల్ సర్వీసెస్‌దే మా బాధ్యత: రమేష్ ఆసుపత్రి ఎండీ

సారాంశం

కోవిడ్ సెంటర్ లో మెడికల్ సర్వీసెస్ మాత్రమే తాము చూసుకొంటామని రమేష్ ఆసుపత్రి ఎండీ  రమేష్ స్పష్టం చేశారు. 


విజయవాడ:కోవిడ్ సెంటర్ లో మెడికల్ సర్వీసెస్ మాత్రమే తాము చూసుకొంటామని రమేష్ ఆసుపత్రి ఎండీ  రమేష్ స్పష్టం చేశారు. 

విజయవాడ స్వర్ణ ప్యాలెస్ లో ఆదివారం నాడు అగ్ని ప్రమాదం చోటు చేసుకొంది. ఈ ప్రమాదంలో 10 మంది కరోనా రోగులు మరణించారు. ఈ ప్రమాదంపై  రమేష్ ఆసుపత్రి ఎండీ సోమవారం నాడు వివరణ ఇచ్చారు.హోటల్ లో సౌకర్యాలన్నీ హోటల్ యాజమాన్యం చూసుకోవాలనేది తమ మధ్య ఒప్పందమని ఆయన గుర్తు చేశారు

also read:విజయవాడ కోవిడ్ సెంటర్‌లో అగ్ని ప్రమాదం: స్వర్ణ ప్యాలెస్, రమేష్ ఆసుపత్రిపై కేసులు

స్వర్ణ ప్యాలెస్ ఘటనలో 10 మంది మరణించడం బాధాకరమన్నారు. మృతుల కుటుంబాలకు ప్రగాఢ సంతాపాన్ని ప్రకటించారు ఆసుపత్రి ఎండీ.ఆరు నెలలుగా కోవిడ్ కేర్ సెంటర్ నడుపుతున్నామని ఆయన ఈ సందర్భంగా ప్రకటించారు.  రెండు ఆసుపత్రులతో ఒప్పందం కుదుర్చుకొని కోవిడ్ సెంటర్ నిర్వహిస్తున్నామని ఆయన తెలిపారు.

ఈ ఘటనపై రాష్ట్ర ప్రభుత్వం కమిటీని ఏర్పాటు చేసింది. 48 గంటల్లో నివేదిక ఇవ్వాలని ఏపీ ప్రభుత్వం ఆదేశించింది. స్వర్ణ ప్యాలెస్ హోటల్ లో ఫైర్ సేఫ్టీ నిబంధనలను ఉల్లంఘించారని   ఫైర్ అధికారులు ప్రాథమిక విచారణలో గుర్తు చేశారు.

ఈ ఘటన జరిగిన తర్వాత మంత్రులు అధికారుల బృందం  ఆదివారం నాడు స్వర్ణ ప్యాలెస్ ను సందర్శించారు. ప్రమాదానికి గల కారణాలను అధికారుల నుండి అడిగి తెలుసుకొన్నారు. 

PREV
click me!

Recommended Stories

YS Jagan Review Meeting with YSRCP Regional Coordinators | వై ఎస్ జగన్ కీలక సమావేశం | Asianet Telugu
స్థానిక ఎన్నికల పోరుకు సిద్ధం పూనకాలు తెపించే జగన్ స్పీచ్ | Asianet News Telugu