చంద్రబాబు కుటుంబ సభ్యులకు నిర్మాత ఆదిశేషగిరిరావు పరామర్శ.. జగన్ సర్కార్‌పై కీలక వ్యాఖ్యలు..

Published : Sep 20, 2023, 03:52 PM IST
 చంద్రబాబు కుటుంబ సభ్యులకు నిర్మాత ఆదిశేషగిరిరావు పరామర్శ.. జగన్ సర్కార్‌పై కీలక వ్యాఖ్యలు..

సారాంశం

తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు నాయుడు అరెస్ట్ నేపథ్యంలో ఆయన సతీమణి భువనేశ్వరి, ఇతర కుటుంబసభ్యులను ప్రముఖ సినీ నిర్మాత ఆదిశేషగిరిరావు పరామర్శించారు. 

స్కిల్ డెవలప్‌మెంట్‌లో అరెస్టైన తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు నాయుడు ప్రస్తుతం రాజమండ్రి సెంట్రల్ జైలులో ఉన్న సంగతి తెలిసిందే. ఈ క్రమంలోనే ఆయన కుటుంబ సభ్యులు కూడా రాజమండ్రిలో ఏర్పాటు చేసిన క్యాంపు సైట్‌లో బస చేస్తున్నారు. చంద్రబాబు సతీమణి భువనేశ్వరితో పాటు  పలువురు కుటుంబ సభ్యులు అక్కడే ఉంటున్నారు. ఈ క్రమంలోనే చంద్రబాబు అరెస్ట్ నేపథ్యంలో భువనేశ్వరి, ఇతర కుటుంబసభ్యులను ప్రముఖ సినీ నిర్మాత ఆదిశేషగిరిరావు పరామర్శించారు. 

ఆ తర్వాత ఆదిశేషగిరిరావు మీడియాతో మాట్లాడుతూ.. తాను చంద్రబాబు నాయుడు, వైఎస్ రాజశేఖరరెడ్డి ఇద్దరినీ సీఎంలుగా చూశానని చెప్పారు. అయితే వారి మద్య ఈ తరహా కక్ష సాధింపు రాజకీయాలు లేవని అన్నారు. సీఎం వైఎస్ జగన్ పాలనలో కొత్త తరహా కక్ష రాజకీయాలు చూస్తున్నామని చెప్పారు. ఏ ఆధారాలు లేకుండా చంద్రబాబును  అరెస్ట్ చేయడం అక్రమం అని అన్నారు. పోలీసులు ఏకపక్షంగా వ్యవహరించడం ప్రజాస్వామ్యానికి మంచిది కాదని పేర్కొన్నారు. 

PREV
click me!

Recommended Stories

తెలుగు ప్రజలారా బిఅలర్ట్..ఆంధ్ర ప్రదేశ్ లో పిడుగుల ప్రమాదం | Asianet News Telugu
Rain Alert : తెలుగు ప్రజలారా బిఅలర్ట్.. పిడుగులు, ఈదురుగాలుల వర్షాలతో ఈ ప్రాంతాలకు పొంచివున్న ప్రమాదం