టూ వీలర్ ఆశ చూపి యువతిపై గ్యాంగ్‌రేప్: నిందితులు చిక్కారిలా...

Published : Jun 16, 2018, 02:44 PM IST
టూ వీలర్ ఆశ చూపి  యువతిపై గ్యాంగ్‌రేప్: నిందితులు చిక్కారిలా...

సారాంశం

బెంగుళూరులో యువతిపై గ్యాంగ్ రేప్ బయటపడిందిలా


బెంగుళూరు: ద్విచక్రవాహనం ఇప్పిస్తామని  ఓ యువతికి మాయమాటలు చెప్పి గ్యాంగ్‌‌రేప్‌కు పాల్పడిన ఘటన ఆరు మాసాల తర్వాత  వెలుగు చూసింది.  ఈ ఘటనకు పాల్పడిన ముగ్గురు నిందితులను  పోలీసులు అరెస్ట్ చేశారు.

యువతిపై అత్యాచారానికి పాల్పడిన మహాలక్ష్మీ లేఔట్‌ నివాసులు భరత్‌, ప్రమోద్‌, హరీష్‌ను అరెస్టు చేసినట్లు అధికారులు తెలిపారు. ఆరు నెలల కిందట దుండగులకు ఆ యువతి పరిచయమైంది. ద్విచక్రవాహనం ఇస్తామని ఆశచూపించారు. 

నిందితుల మాటలను నమ్మిన ఆ యువతి  వారి వెంట వెళ్ళింది.  బాధిత యువతిని  మాండ్య, తమకూరు ప్రాంతాల్లో తిప్పి నిర్మానుష్యంగా  ఉన్న ప్రాంతానికి తీసుకెళ్ళి సామూహిక అత్యాచారానికి పాల్పడ్డారు. అయితే ఈ విషయమై  ఆమె పోలీసులకు ఫిర్యాదు చేయలేదు.కానీ ఆమెను అప్పుడప్పుడూ ఈ విషయమై బెదిరింపులకు పాల్పడేవారు.

అయితే   ఈ ముగ్గురు నిందితులు ఇటీవల కాలంలో ఓ దొంగతనం కేసులో  అరెస్టయ్యారు. విచారణ సమయంలో గ్యాంగ్ రేప్ విషయాన్ని కూడ నిందితులు బయటపెట్టారు.  అయితే బాధితురాలిని వైద్య పరీక్షల కోసం  ఆసుపత్రికి తరలించారు. కేసు నమోదు చేసుకొని పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.

PREV
click me!

Recommended Stories

No Petrol Shortage in AP:రాష్ట్రంలో పెట్రోల్ కొరత లేదు విజయవాడ జాయింట్ కలెక్టర్| Asianet News Telugu
సచిన్ పవర్ ఫుల్ స్పీచ్ కి దద్దరిల్లిన ఆంధ్ర యూనివర్సిటీ | Andhra University Centenary Celebrations