వాసవీ సత్రం నుంచి పడిపోయిన చిన్నారి
ప్రముఖ పుణ్య క్షేత్రం శ్రీశైలంలో తీవ్ర విషాదం చోటుచేసుకుంది. శ్రీశైలంలోని వాసవి సత్రం పై నుంచి ఓ చిన్నారి కింద పడిపోయింది. తీవ్రగాయాలైన చిన్నారిని వెంటనే చికిత్స నిమిత్తం హైదరాబాద్ కి తరలించారు.
తల్లిదండ్రలు అజాగ్రత్త కారణంగానే చిన్నారి కిందపడిపోయినట్లు తెలుస్తోంది. ప్రస్తుతం చిన్నారి పరిస్థితి ఆందోళనకరంగా ఉన్నట్లు వైద్యులు తెలిపారు. ఈ ఘటనకు సంబంధించి పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.