పవన్ కల్యాణ్ కు స్వల్ప అస్వస్థత...

Published : Jun 27, 2023, 12:21 PM IST
పవన్ కల్యాణ్ కు స్వల్ప అస్వస్థత...

సారాంశం

జనసేన అధినేత పవన్ కల్యాణ్ అనారోగ్యం పాలయ్యారు. ఉపవాసంతో నీరసం వల్ల అస్వస్థతకు గురైనట్లు సమాచారం. 

భీమవరం : జనసేన అధినేత పవన్ కల్యాణ్ అస్వస్థతకు గురయ్యాడు. ఆంధ్రప్రదేశ్ లోని పశ్చిమ గోదావరి జిల్లాలో వారాహి యాత్రలో భాగంగా పర్యటిస్తున్నారు. ఇదే సమయంలో స్వల్ప అస్వస్థతకు గురయ్యారు. దీంతో పెదఅమిరంలోని నిర్మలాదేవి ఫంక్షన్ హాల్లో విశ్రాంతి తీసుకుంటున్నారు. 

పవన్ కల్యాణ్ ఉపవాస దీక్షలో ఉన్నారు. దీంతో నీరసంతో స్వల్ప అస్వస్థతకు గురైనట్లుగా సమాచారం. పవన్ కల్యాణ్ అనారోగ్యం కారణంగా ఉదయం 11 గంటలకు భీమవరం నియోజకవర్గ నేతలతో నిర్వహించాల్సిన భేటి వాయిదా పడింది. మద్యాహ్నం తరువాత ఈ భేటీ జరగనుంది. 

ఇతర పార్టీలకు చెందిన కొంతమంది నేతలు పవన్ కల్యాణ్ సమక్షంలో జనసేనలో చేరనున్నారు. అందుకే మధ్యాహ్నం తరువాత మీటింగ్ జరగనుంది. 
 

PREV
Read more Articles on
click me!

Recommended Stories

IMD Cold Wave Alert : తెలుగు రాష్ట్రాల్లో టెంపరేచర్స్ కుప్పకూలడానికి .. చలి బీభత్సానికి కారణమేంటో తెలుసా?
Tirupati : టీటీడీలో మరో భారీ కుంభకోణం.. నకిలీ పట్టు వస్త్రాల పేరుతో రూ.55 కోట్ల మోసం