Bro: థియేటర్‌లో పాలాభిషేకంతో స్క్రీన్ పై పాలు.. చిరిగిపోయిన స్క్రీన్.. పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ అరెస్టు

Published : Jul 28, 2023, 05:02 PM IST
Bro: థియేటర్‌లో పాలాభిషేకంతో స్క్రీన్ పై పాలు.. చిరిగిపోయిన స్క్రీన్.. పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ అరెస్టు

సారాంశం

బ్రో సినిమా విడుదల కావడంతో పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ పూనకాలు మోడ్‌లోకి వచ్చారు. థియేటర్‌ల ముందు పండుగ చేసుకున్నారు. అయితే, ఏపీలోని పార్వతీపురంలోని థియేటర్‌లో ఈ వేడుక హద్దు మీరింది. అపశృతి చోటుచేసుకుంది. అభిమానులు థియేటర్‌లో స్క్రీన్ పై పాలాభిషేకం చేయడం, ఆ స్క్రీన్ చిరిగిపోవడంతో పోలీసులు కొందరు పవన్ ఫ్యాన్స్‌ను అరెస్టు చేసి తీసుకెళ్లారు.  

హైదరాబాద్: పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ ఆతృతగా ఎదురుచూసిన బ్రో సినిమా విడుదలైంది. ఫ్యాన్స్ పండుగ చేసుకున్నారు. ఏపీ, తెలంగాణల్లోని థియేటర్ల ముందు అభిమానుల కోలాహలం కనిపించింది. హైదరాబాద్‌లోని కొన్ని థియేటర్‌లలో బ్యాండ్‌లతో సామూహికంగా డ్యాన్స్ చేశారు. ఒక రకమైన పూనకాలు కనిపించాయి. అయితే.. ఈ వేడుకల్లో ఓ అపశృతి జరిగింది. ఆంధ్రప్రదేశ్‌లోని పార్వతిపురంలోని థియేటర్‌లో కొందరు అభిమానులు స్క్రీన్ పై కనిపించిన పవన్ కళ్యాణ్‌‌కు పాలాభిషేకం చేశారు. పాలను నేరుగా థియేటర్ స్క్రీన్ పై పోసేశారు. ఆ తర్వాత థియేటర్‌లో అంతా గందరగోళంగా మారింది. ఆ తర్వాత స్క్రీన్ చిరిగిపోయింది.

బ్రో సినిమాకు వచ్చిన కొందర పవన్ కళ్యాణ్ అభిమానులు పార్వతిపురంలోని థియేటర్‌లో స్క్రీన్‌కు పాలాభిషేకం చేశారు. ఆ తర్వాత స్క్రీన్ చిరిగిపోయింది. దీంతో థియేటర్ యాజమాన్యం ఖంగారుపడింది. పోలీసులకు సమాచారం ఇచ్చింది. వారు కేసు ఫైల్ చేశారు. పోలీసులు ఆ థియేటర్ వద్దకు చేరుకున్నారు. నిందితులను గుర్తించి జీపులో తీసుకెళ్లారు. దుస్తులు చినిగిపోయి ఉన్న కొందరిని పోలీసులు తీసుకెళ్లారు. 

Also Read: మణిపూర్ హింసపై సీబీఐతో దర్యాప్తు జరిపించాలి.. ఎందుకంటే..: సుప్రీంకోర్టులో కేంద్రం అఫిడవిట్

బ్రో సినిమాను సముత్తిరకని దర్శకత్వం వహించారు. పవన్ కళ్యాణ్‌తోపాటు సాయి ధరమ్ తేజ్, ప్రియా ప్రకాశ్ వారియర్, కేతిక శర్మ, బ్రహ్మానందం, సుబ్బరాజు, వెన్నెల కిశోర్ సహా పలువురు నటించారు. 

PREV
Read more Articles on
click me!

Recommended Stories

మోదీకి గాడ్సే కి తేడా ఉందా? YS Sharmila Comments | AP Congress | Asianet News Telugu
YS Jagan Comments: రాంబాబు చేసిన పనికి పొగడాలి అంబటిపై జగన్ కామెంట్స్| Asianet News Telugu