సేవ చేయాలనుకునేవారికే జనసేన: పవన్

sivanagaprasad kodati |  
Published : Sep 23, 2018, 05:00 PM IST
సేవ చేయాలనుకునేవారికే జనసేన: పవన్

సారాంశం

ప్రజలకు నిజంగా సేవ చేయాలనుకునే వారి కోసమే జనసేన పార్టీ అన్నారు జనసేన అధినేత పవన్ కల్యాణ్. నెల్లూరులో జరుగుతున్న రొట్టెల పండుగలో పాల్గొనేందుకు వచ్చిన ఆయన అభిమానులు, కార్యకర్తలతో సమావేశమయ్యారు. 

ప్రజలకు నిజంగా సేవ చేయాలనుకునే వారి కోసమే జనసేన పార్టీ అన్నారు జనసేన అధినేత పవన్ కల్యాణ్. నెల్లూరులో జరుగుతున్న రొట్టెల పండుగలో పాల్గొనేందుకు వచ్చిన ఆయన అభిమానులు, కార్యకర్తలతో సమావేశమయ్యారు.

వారిని ఉద్దేశించి మాట్లాడుతూ.. జనసేనలోకి వచ్చే వారు ప్రజలపై అంకితభావం, సేవ చేయాలనుకునే ఆకాంక్ష ఉండాలని, అలాంటి తపన ఉన్నవారిని కచ్చితంగా పార్టీలోకి ఆహ్వానిస్తామన్నారు.

జనసేనలో కుల, మతాలకు చోటు ఉండదని స్పష్టం చేశారు. ప్రతి పౌరుడు ఓటు నమోదు చేయించుకోవాలని సూచించారు. అనంతరం పవన్ తనకు చిన్నప్పుడు చదువు నేర్పిన గురువులను సన్మానించారు. 

PREV
click me!

Recommended Stories

Vegetable Price : ఈ వారాంతం సంతలో కూరగాయల ధరలు ఎలా ఉండనున్నాయో తెలుసా?
IMD Cold Wave Alert : ఈ సీజన్లోనే కూలెస్ట్ మార్నింగ్స్ .. 14 జిల్లాల్లో ఆరెంజ్, 19 జిల్లాల్లో ఎల్లో అలర్ట్