Andhra Pradesh డ్వాక్రా మహిళలకు అదిరిపోయే శుభవార్త..పిల్లల చదువు కోసం స్త్రీ నిధి నుంచి మరో లక్ష రుణం..!

Published : Jun 07, 2025, 04:46 AM IST
Money Cash

సారాంశం

డ్వాక్రా మహిళల పిల్లల చదువుకు 4% వడ్డీకే రుణాలిచ్చే ‘ఎన్టీఆర్ విద్యా సంకల్పం’ పథకాన్ని ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ప్రారంభించనుంది.

ఆంధ్రప్రదేశ్‌లో డ్వాక్రా సంఘాల మహిళల పిల్లల చదువుకు ఆర్థిక సహాయంగా రాష్ట్ర ప్రభుత్వం ప్రత్యేక రుణ పథకాన్ని తీసుకొస్తోంది. 'ఎన్టీఆర్ విద్యా సంకల్పం'గా పేరుపెట్టిన ఈ పథకం ద్వారా తక్కువ వడ్డీకే రుణాలను అందించనున్నారు. ప్రస్తుతం స్త్రీనిధి బ్యాంక్ ద్వారా డ్వాక్రా సభ్యులు 11 శాతం వడ్డీకే రుణాలు తీసుకుంటున్నారు. అయితే ఈ కొత్త పథకంలో వారు కేవలం 4 శాతం వడ్డీకే రూ.10 వేల నుంచి రూ.1 లక్ష వరకు రుణాన్ని పొందవచ్చు.

ఖర్చులను తగ్గించడానికే..

ఈ పథకాన్ని పిల్లల చదువులో వచ్చే ఖర్చులను తగ్గించడానికే రూపొందించారు. పాఠశాల ఫీజులు, పుస్తకాలు, యూనిఫాం, సైకిళ్లు, టెక్నికల్ కోర్సులకు అవసరమైన వస్తువులు వంటి వాటి కొనుగోలుకు ఈ రుణాన్ని వినియోగించవచ్చు. ప్రభుత్వం రూపొందించిన గైడ్‌లైన్స్ ప్రకారం, రుణం తీసుకున్న వారు దానిని ఏ అవసరానికి ఉపయోగించారో సంబంధిత రసీదులను స్త్రీనిధి అధికారులకు ఇవ్వాల్సి ఉంటుంది.

ప్రభుత్వ, ప్రైవేట్ విద్యాసంస్థల్లో చదివే…

కేజీ నుంచి పీజీ వరకు చదివే విద్యార్థుల తల్లులు ఈ పథకానికి అర్హులు. ప్రభుత్వ, ప్రైవేట్ విద్యాసంస్థల్లో చదివే పిల్లలకు ఇది వర్తించనుంది. రుణాన్ని నెలవారీ వాయిదాలుగా తిరిగి చెల్లించవచ్చు. రుణ పరిమాణాన్ని బట్టి కనీసం 24 నెలలు నుంచి గరిష్ఠంగా 36 నెలల వరకూ తిరిగి చెల్లించే వీలుంటుంది.

ఈ పథకం అమలుకు రాష్ట్ర ప్రభుత్వం సంవత్సరానికి సుమారు రూ.200 కోట్లు వెచ్చించనున్నట్టు సమాచారం. ముఖ్యమంత్రి చంద్రబాబు త్వరలో ఈ పథకాన్ని అధికారికంగా ప్రారంభించనున్నారు. లక్షలాది మహిళల పిల్లల విద్యాభవిష్యత్తుకు ఇది ఒక మంచి మార్గం కానుంది.

PREV
Read more Articles on
click me!

Recommended Stories

లోకేష్ పంచ్ లకి పడి పడి నవ్విన టీచర్స్ Nara Lokesh Meets Teachers Returned from Singapore Study Tour
ఇలా చేస్తే ఒక్క క్లిక్ తో ఏ సబ్జెక్టువీక్ ఉన్నాడో ఈజీగా తెలిసిపోతుంది | Nara Lokesh Meets Teachers