కిడారి సర్వేశ్వరరావు హత్య: చార్జీషీటు దాఖలు చేసిన ఎన్ఐఏ

By narsimha lodeFirst Published Apr 10, 2019, 5:32 PM IST
Highlights

దివంగత అరకు ఎమ్మెల్యే కిడారి సర్వేశ్వరరావు హత్య కేసులో ఎన్ఐఏ చార్జీషీటు దాఖలు చేసింది.
 

విశాఖపట్టణం:  దివంగత అరకు ఎమ్మెల్యే కిడారి సర్వేశ్వరరావు హత్య కేసులో ఎన్ఐఏ చార్జీషీటు దాఖలు చేసింది.

గత ఏడాది సెప్టెంబర్ 23వ తేదీన  డుంబ్రిగుంట మండలం లిప్పిట్టిపుట్టు వద్ద  మావోలు జరిపిన కాల్పుల్లో అరకు ఎమ్మెల్యే కిడారి సర్వేశ్వరరావు, మాజీ ఎమ్మెల్యే సివిరి సోమలు మృతి చెందారు.

ఈ ఘటనపై నలుగురు నిందితులపై అభియోగాలను నమోదు చేసింది ఎన్ఐఏ. కిడారి సర్వేశ్వరరావును మావోలు హత్య చేయడంతో సర్వేశ్వరరావు తనయుడు శ్రవణ్‌కు చంద్రబాబునాయుడు మంత్రి వర్గంలో బెర్త్ దక్కింది. 
 

click me!