మాస్క్ పెట్టుకోని జగన్ కు ఏ శిక్ష విధిస్తారు??.. నారా లోకేష్ ఫైర్...

By AN TeluguFirst Published Jul 21, 2021, 3:58 PM IST
Highlights

దళితులంటే సీఎం జగన్ రెడ్డికి ఎందుకంత కక్ష అని టీడీపీ జాతీయ అధ్యక్షుడు నారా లోకేష్ ప్రశ్నించారు. చీరాలలో దళిత యువకుడు కిరణ్ కుమార్ ను మాస్క్ లేదని, వైసీపీ పోలీసులు కొట్టి చంపి ఏడాదైందని గుర్తు చేశారు. 

టీడీపీ జాతీయ అధ్యక్షుడు నారా లోకేష్ ఏపీ సీఎం జగన్ పై విరుచుకుపడ్డారు. ఏ రోజూ మాస్క్ పెట్టుకోని జగన్ కు ఏ శిక్ష విధించాలంటూ మండిపడ్డారు.

దళితులంటే సీఎం జగన్ రెడ్డికి ఎందుకంత కక్ష అని టీడీపీ జాతీయ అధ్యక్షుడు నారా లోకేష్ ప్రశ్నించారు. చీరాలలో దళిత యువకుడు కిరణ్ కుమార్ ను మాస్క్ లేదని, వైసీపీ పోలీసులు కొట్టి చంపి ఏడాదైందని గుర్తు చేశారు. 

నిందితులైన పోలీసులమీద ఇప్పటివరకు ఎలాంటి చర్యలు తీసుకోలేదని, జగన్ రెడ్డి ఫ్యాక్షన్ పాలనలో దళితులకు బతికే హక్కులేదా? అని లోకేష్ ప్రశ్నించారు. మాస్క్ పెట్టుకోకపోవడమే నేరమైతే.. రోజూ మాస్క్ పెట్టుకోని జగన్ రెడ్డికి ఏ శిక్ష విధిస్తారు? అని ప్రశ్నించారు. ఇప్పటికైనా కిరణ్ మృతికి కారణమైన వారిని శిక్షించాలని, కిరణ్ కుమార్ కుటుంబానికి రూ. 50 లక్షలు పరిహారం ఇవ్వలని లోకేష్ డిమాండ్ చేశారు. 

click me!